ఘంటసాల గొప్ప ఉద్యమకారుడు కూడా...
ఘంటసాల భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి యాభై ఏళ్లు కావస్తున్నా.. తెలుగువారిని, తెలుగు నేలను పాటల రూపంలో ప్రతిక్షణం పలకరిస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన
ఆయన స్వాతంత్య్ర సమరయోధులనూ ఉత్తేజితం చేశారు
మహా గాయకుడి సంస్మరణార్థం దిల్లీలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తున్న సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. చిత్రంలో డా.వి.గీత, చోడవరం ఎంఎల్ఏ
కరణం ధర్మశ్రీ, మంత్రి శ్రీనివాసగౌడ్, మండలి బుద్ధప్రసాద్, సంజయ్ కిషోర్,
మురళీమోహన్, ఆర్.నారాయణ మూర్తి తదితరులు
రవీంద్రభార[తి, న్యూస్టుడే: ఘంటసాల భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి యాభై ఏళ్లు కావస్తున్నా.. తెలుగువారిని, తెలుగు నేలను పాటల రూపంలో ప్రతిక్షణం పలకరిస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ‘సంగమం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ సభ శనివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ ‘‘స్వాతంత్రోద్యమంలో 18 నెలల పాటు జైలులో ఉండి తోటి సమరయోధులను ఘంటసాల తన పాటల ద్వారా చైతన్యవంతం చేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ‘తెలుగువీర లేవరా..’ పాటవింటే ఎంతో ఉత్తేజం కలుగుతుంది. ఆయన పాటల మాంత్రికుడే కాదు, గొప్ప ఉద్యమకారుడు కూడా’’అని కీర్తించారు. జీవించినంత కాలం పాడాలని.. పాడినంత కాలం జీవించాలని చెప్పినట్లుగానే ఘంటసాల తన జీవితాన్ని ముగించారని అన్నారు. దిల్లీలో ఘంటసాల సంస్మరణార్థం తన ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తానని జస్టిస్ రమణ ప్రకటించారు.
అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాలి...
తొలినాళ్లలో సినిమారంగం వివిధ సామాజిక అంశాలపై చర్చించి ప్రజల్లో చైతన్యానికి దోహదపడింది. ఇప్పుడా విలువలు కనిపించడం లేదు. అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘పరాయిభాష నేర్చుకుంటే గొప్పవాళ్లమవుతామనే తపనలో మన భాషా సంస్కృతులు దిగజార్చేలా ప్రవర్తిస్తున్నామా.. అనిపిస్తోంది. ఆంగ్లభాష నేర్చుకుంటేనే గొప్పవాళ్లు అవుతారనే అపోహల్ని సృష్టిస్తున్నారు. నేను డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నాను. న్యాయవిద్యలో చేరాకే ఆంగ్లం నేర్చుకున్నా. అయినా దిల్లీ వరకు వెళ్లగలిగాన’ని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పించి, వారితో మంచి పుస్తకాలు చదివించాలని సూచించారు. ‘ఓం నమో వెంకటేశా, ఓం నమో తిరుమలేశా..’ అంటూ ఘంటసాల పాడిన ప్రార్థనా గీతంతో జస్టిస్ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఘంటసాల శతజయంత్యుత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఏపీలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం సైతం ఉంటుందని అన్నారు. సంగమం నిర్వాహకులు సంజయ్కిశోర్ స్వాగతం పలికారు. సభలో శాంతా బయోటెక్ అధినేత కె.ఐ.వరప్రసాదరెడ్డి, సినీ దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, నటి మంజుభార్గవి, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి.గీత కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (97), ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్, ‘మన ఘంటసాల’ పుస్తక రచయిత డా.పి.ఎస్.గోపాలకృష్ణను సత్కరించారు. అంతకుముందు సంగీత గురువులు శశికళాస్వామి, జయశ్రీ వంద మంది బాలికలతో సమర్పించిన ఘంటసాల పాటల చరణాల విభావరి మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమానికి ముందు రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం