రెగ్యులర్ ఊసే లేదు.. పార్ట్టైమ్కు అనుమతివ్వదు
విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ఆచార్యుల నియామకాల ఊసే లేదు...కనీసం పార్ట్టైమ్ అధ్యాపకులను నియమించుకోవడానికి అనుమతి అడిగినా సర్కారు మీనమీషాలు లెక్కిస్తోంది. విశ్వవిద్యాలయాల పాలకమండలి సమావేశంలో ఆమోదం
వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలపై ప్రభుత్వ వైఖరి ఇదీ
సర్కారు ధోరణిపై అసంతృప్తిలో వీసీలు
పాఠాలు ఎవరు బోధిస్తారంటూ నిలదీస్తున్న విద్యార్థులు
కొన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు ఎత్తేయాల్సిన పరిస్థితి
విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ఆచార్యుల నియామకాల ఊసే లేదు...కనీసం పార్ట్టైమ్ అధ్యాపకులను నియమించుకోవడానికి అనుమతి అడిగినా సర్కారు మీనమీషాలు లెక్కిస్తోంది. విశ్వవిద్యాలయాల పాలకమండలి సమావేశంలో ఆమోదం తీసుకున్న తర్వాతా విద్యాశాఖ నాన్చుతుండటంతో కొందరు వీసీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యార్థులు తమకు పాఠాలు చెప్పేవారెవరని వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే అనుమతి కోసం పంపిన వర్సిటీ అధికారులు విద్యాశాఖ ఎప్పుడు అనుమతి ఇస్తుందా అని ఎదురుచూస్తుంటే...మరికొందరు పంపించినా అనుమతి వస్తుందో? లేదో? అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
రెండు నెలలవుతున్నా..
విశ్వవిద్యాలయాల్లో మూడు రకాల బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు. వారు రెగ్యులర్, కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకులు. విద్యార్థులకు పాఠాలు చెప్పే వారిలో 90 శాతం కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులే. వారు లేకుంటే కొన్ని కోర్సులు నడిపే పరిస్థితి లేదు. పాలమూరు విశ్వవిద్యాలయం సెప్టెంబరు మధ్యలో 41 మంది అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకాల చివరి దశలో తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క నియామకం జరపరాదని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా సెప్టెంబరు నెలాఖరులో అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ వర్సిటీలో నియామకాలు నిలిచిపోయాయి. వాస్తవానికి అక్కడి అధికారులు వర్సిటీ పాలకమండలి ఆమోదం తీసుకున్నా విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటికీ అనుమతి దక్కలేదు. వచ్చే కొత్త విద్యా సంవత్సరానికే కాకుండా ఇప్పటికే నడుస్తున్న సెమిస్టర్లో కూడా అధ్యాపకులు అవసరమని ఆ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా పార్ట్టైమ్ అధ్యాపకులు దాదాపు 18 మంది వరకు అవసరమని తెలిసింది. నియామక అనుమతికి ఎన్నాళ్లు పడుతుందోనన్న అనుమానం వర్సిటీ అధికారుల్లో నెలకొంది. వాటికి అనుమతి రాకుంటే కొన్ని కోర్సులు ఎత్తేయక తప్పదని సమాచారం. ‘కొన్ని సార్లు అత్యవసరంగా నియమించుకోవాల్సి ఉంటుంది... ప్రభుత్వ అనుమతి అంటే ఆలస్యమై విద్యార్థులు నష్టపోతారు’ అని వీసీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘పనిభారం ఆధారంగానే తాత్కాలికంగా నియమించుకుంటున్నాం.. ఒక వర్సిటీలో అవకతవకలు జరిగాయని అన్ని వర్సిటీలకు కలిపి ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదు’ అని మరో ఉపకులపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి తప్పనిసరి కాకుండా...స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుండేదని వర్సిటీ రిజిస్ట్రార్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆర్థికశాఖ అనుమతీ తప్పదా?
పార్ట్ టైమ్ అధ్యాపక పోస్టుల భర్తీకి విద్యాశాఖ అనుమతి ఇవ్వాలంటే... ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. అనుమతి లేకుండా ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయరాదని ఆర్థిక శాఖ కొద్ది నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలంటే ఇప్పట్లో కష్టమేనని భావిస్తున్నారు. ఇదే సమస్యపై కొంత మంది ఉపకులపతులు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు