వారసత్వ బదిలీ.. వివాదాలుగా మారి
‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా
రిజిస్ట్రేషన్ తరువాత అడ్డు చెబుతున్న కుటుంబ సభ్యులు
స్లాటు నమోదైతే ఆపలేమంటున్న అధికారులు
చట్టం అమలులో స్పష్టత లేకపోవడమే కారణం
ఈనాడు, హైదరాబాద్
‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా ఇవ్వలేదు. ఇది అన్యాయం’ అంటూ ఓ పెద్దావిడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయ పోరాటానికి దిగారు. ఇలా కుటుంబ సభ్యులందరి ఆమోదం లేకుండానే వారసత్వ బదిలీ చేశారంటూ పలు జిల్లాల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల వారసత్వ బదిలీ ప్రక్రియలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ధరణి పోర్టల్ ఆధారంగా ఆటోమేటిక్ విధానంలో వారసత్వ బదిలీ (సక్సెషన్) పూర్తి చేసి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా ధరణిలో సులువుగా, ఆటోమేటిక్ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు పూర్తిచేస్తున్న తీరు బాగున్నా.. అదే తీరును వారసత్వ బదిలీలో అమలు చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అమలుకాని ముఖ్యమంత్రి ఆదేశాలు
వారసత్వ బదిలీ హక్కుల విషయంలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెస్తుందని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే పాసుపుస్తకాల్లో ముందుగానే కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేస్తారని, తద్వారా వారసత్వ వివాదాలు ఉండవని సూచించారు. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తమైనప్పటికీ రెవెన్యూశాఖ అమల్లోకి తేలేదు. పోర్టల్ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారసత్వంపై అభ్యంతరాలు ఉన్నచోట వివాదాలు వస్తూనే ఉన్నాయి. వారసత్వ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలంటే రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయి విచారణ అధికారం కల్పించాలని, లేనిపక్షంలో కుటుంబ ధ్రువీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్) తప్పనిసరి చేయడమనే నిబంధనను జోడించాలంటూ రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.
గతంలో ఇలా...
గతంలో భూయజమాని తదనంతరం వారసత్వ బదిలీకి క్షేత్రస్థాయి విచారణ ఉండేది. యజమాని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేవారు. పది రోజుల వ్యవధిలో నోటీసులకు వచ్చిన వివరణ, క్షేత్రస్థాయి అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారు వారసులెవరనేది తేల్చి... రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు బదలాయించేవారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అనంతరం ఈ విచారణ చేపట్టడం లేదు. పైగా స్లాటు నమోదై తహసీల్దారు-సంయుక్త సబ్ రిజిస్ట్రారు వద్దకు వస్తే అడ్డుచెప్పకుండానే రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం సూచిస్తోంది. దీంతో తహసీల్దార్లు వారసత్వ బదిలీని పూర్తి చేసేస్తున్నారు.
ఏడు రోజుల వ్యవధి ఎందుకో?
ధరణి పోర్టల్లో నిర్వహిస్తున్న వారసత్వ బదిలీ ప్రక్రియపై రెవెన్యూ అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. భూయజమానులు మీసేవలో లాగిన్ అయ్యాక.. 7 రోజులకు స్లాట్ నమోదు జరుగుతోంది. తరువాత తహసీల్దారు-సంయుక్త సబ్ రిజిస్ట్రారు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మిగిలిన సేవలు ఒకట్రెండు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. వారసత్వ బదిలీకి సంబంధించి భూయజమాని లాగిన్ అయినదీ, స్లాట్ నమోదు చేసుకున్నదీ తహసీల్దారు వద్దకు చేరేదాకా వారికి ఏ సమాచారం ఉండటంలేదు. ధరణి పోర్టల్ అమలు తర్వాత కూడా మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో.. దీనిలో స్పష్టత కొరవడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరణి సేవల అమలు మినహా తహసీల్దార్లకు అధికారాలేవీ లేవు. గతేడాది పాత ఆర్ఓఆర్ చట్టం రద్దు చేశాక క్షేత్రస్థాయి విచారణ అధికారాలన్నీ రద్దయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?