రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు
కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం
నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన
11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు
15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు
బదలాయింపు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం వరకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి, తమ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఉన్నతాధికారులు ప్రదర్శించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి... వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఉద్యోగుల నుంచి బదిలీల కోసం ఐచ్ఛికాలను స్వీకరిస్తారు. పదో తేదీన ఈ దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ జాబితాను పరిశీలిస్తారు. 11 నుంచి 15 తేదీ వరకు బదలాయింపులపై జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జరుగుతాయి. 15వ తేదీన సొంత జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా అయిదు జిల్లాల్లో ఉద్యోగుల బదలాయింపులకు ఐచ్ఛికాలు ఇచ్చి ప్రక్రియను కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా స్థాయి బదలాయింపుల అనంతరం జోనల్, బహుళ జోనల్ ఉద్యోగుల బదలాయింపులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. జోనల్, బహుళ జోనల్ బదిలీలపై పర్యవేక్షణకూ అధికారులను నియమిస్తారని తెలుస్తోంది.
* ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం సాయంత్రంలోగా ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని శాఖలు, కలెక్టర్లు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ఆదేశించారు. బదలాయింపులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు.
* టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్లు సీఎస్ను కలిశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ ఐచ్ఛికాలు ఇస్తేనే బదిలీల్లో పరిపూర్ణత...
ప్రభుత్వం చేపడుతున్న జోనల్ బదిలీల్లో పలు కీలక అంశాలు, ఐచ్ఛికాలను చేర్చితేనే ఉద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సూచించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్లతో కూడిన ప్రతినిధి బృందం సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ బదిలీలపై చేసిన సూచనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని ట్రెసా ప్రతినిధులు తెలిపారు. వారు సూచించిన కీలకాంశాలు
* వివిధ కేడర్ల పోస్టులకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ బదిలీలకు ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇవ్వాలి.
* ప్రొఫార్మాలో స్పౌస్, పీహెచ్సీ (దివ్యాంగుల కోటా) కేటగిరి, మెడికల్ గ్రౌండ్స్ ఐచ్ఛికాలు తప్పనిసరిగా పొందుపర్చాలి.
* కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 2016లో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీలు చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాతోపాటు ఉద్యోగంలో చేరాక మొదటి నియామక జిల్లా (ఎస్టాబ్లిష్మెంట్ జిల్లా)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* రెవెన్యూశాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన గరిష్ఠ కేడర్ స్ట్రెంత్ను నిర్ధారించాలి.
* డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు కల్పించాలి.
* డీపీసీ ఆమోదం పొంది తహసీల్దార్ల పోస్టింగ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న డీటీలకు పోస్టింగ్ ఇవ్వాలి.
* ప్రభుత్వ అవసరార్థం దూర ప్రాంతాల్లో నియమించిన ప్రొబెషనరీ డీటీలకు జిల్లాలకు బదిలీ అవకాశం కల్పించాలి.
* వీఆర్వోలకు బదిలీ ఐచ్ఛికం ఇవ్వాలి.
జోనల్ విధానంతో సంపూర్ణన్యాయం: శ్రీనివాస్గౌడ్
టీజీవోల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు కొత్త జోనల్ విధానం ద్వారా సంపూర్ణన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాల్లో, జోన్లలో శాశ్వతంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పక్కాగా, సకాలంలో పూర్తయ్యేందుకు టీజీవో, టీఎన్జీవో తదితర సంఘాలు సహకరించాలన్నారు. సర్దుబాటైన వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. సంఘం బాధ్యులందరూ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?