కొనసాగుతున్న ప్రతిష్టంభన
ప్రతిపక్ష ఎంపీలు 12 మందిపై విధించిన సస్పెన్షన్ రద్దు అంశం మంగళవారం కూడా రాజ్యసభను కుదిపేసింది. విపక్ష సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభ ఎలాంటి కార్యకలాపాలను చేపట్టలేకపోయింది.
రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షం
12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్
పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
దిల్లీ: ప్రతిపక్ష ఎంపీలు 12 మందిపై విధించిన సస్పెన్షన్ రద్దు అంశం మంగళవారం కూడా రాజ్యసభను కుదిపేసింది. విపక్ష సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభ ఎలాంటి కార్యకలాపాలను చేపట్టలేకపోయింది. సస్పెన్షన్ రద్దుపై చర్చించాలని విపక్షం, విచారం వ్యక్తం చేస్తేనే సభలోకి అనుమతిస్తామని అధికార పక్షం ఎవరికి వారు పట్టుదలతో వ్యవహరించడంతో మొత్తం మూడు సార్లు సభ వాయిదా పడింది. చివరిగా మధ్యాహ్నం 3.12గంటలకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం తొలుత ఉదయం 11 గంటల సమయంలో రాజ్యసభ సమావేశమయ్యింది. సభా కార్యకలాపాల జాబితాను సభ్యుల ముందు ఉంచగానే ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించారు. జాబితాలోని అంశాలన్నిటినీ పక్కన పెట్టి నిబంధన 267 కింద ఇచ్చిన నోటీసుపై చర్చించాలన్న విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థనను అంగీకరించడంలేదని సభాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్.. రెండు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అనుమతించారు. మంత్రి మన్సుఖ్ మాండవీయ అందుకు ఉద్యుక్తుడవుతుండగానే విపక్ష సభ్యులు నినాదాలు అందుకున్నారు. సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి భేటీ కాగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. సంతాన సాఫల్య సహాయక సాంకేతికతల(నియంత్రణ)బిల్లు-2021, సరోగసీ(నియంత్రణ) బిల్లు-2020లను ప్రవేశపెట్టారు.
వారికి పరిహారం చెల్లించాలి: రాహుల్
సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల తరఫున వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్