తెలంగాణకు బియ్యం సేకరణకు రూ.1,752 కోట్లు చెల్లించాలి
కేంద్ర వాటా కింద (సెంట్రల్ పూల్) సేకరించిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,751.79 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఈ బకాయిల గురించి లోక్సభలో
ఈనాడు, దిల్లీ: కేంద్ర వాటా కింద (సెంట్రల్ పూల్) సేకరించిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రూ.1,751.79 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఈ బకాయిల గురించి లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. తెలంగాణ బకాయిల్లో ఎఫ్సీఐ రూ.1,464.64 కోట్లు, డీసీపీ కింద రాష్ట్రం క్లెయిమ్చేసిన రూ.287.15 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు వివరించారు. 2021-22 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో తెలంగాణ అవసరాల కోసం బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) 2.20 లక్షల మెట్రిక్ టన్నులు, ఆ రాష్ట్రం ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన 15 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 17.20 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు.
రైల్వే పాఠశాలల హేతుబద్ధీకరణ!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి చాలాచోట్ల రైల్వే పాఠశాలలను మూసేయాలని ప్రతిపాదించినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వైకాపా ఎంపీ శ్రీధర్ కోటగిరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
రాష్ట్రంలో 11.23%, ఏపీలో 18.94% ఏకోపాధ్యాయ పాఠశాలలు
తెలంగాణలో 11.23%, ఆంధ్రప్రదేశ్లో 18.94% ఏకోపాధ్యాయ పాఠశాలలున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతీయ స్థాయిలో సగటున 6.80% మేర ఇలాంటివి ఉన్నట్లు వెల్లడించారు. ¸సమగ్ర శిక్ష కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.394.73 కోట్లు, ఏపీకి రూ.492.40 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదించినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.
కల్వకుర్తి-హైదరాబాద్ రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
కల్వకుర్తి-హైదరాబాద్ రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెరాస ఎంపీ కె.ఆర్.సురేష్రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మార్గం ఆధునికీకరణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, భారత్మాల లాంటి ప్రాజెక్టుల్లో చేర్చే దిశగానూ యోచిస్తోందన్నారు.
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోనివి జాతీయ రహదారులు కావు
తెలంగాణ నుంచి కర్ణాటకలోని బీజాపుర్, రామసముద్ర, యాద్గిర్ నగరాల సరిహద్దుల్లో ఉన్న మార్గాలు జాతీయ రహదారులు కావని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న 118 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారి 163గా 2016 నవంబరులో ప్రకటించినట్లు చెప్పారు. అందులో హైదరాబాద్ రింగ్ రోడ్డు నుంచి మన్నెగడ్డ వరకు 46 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు వరసలుగా నిర్మించే బాధ్యతలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించామన్నారు. మన్నెగడ్డ నుంచి రావులపల్లె (తెలంగాణ-కర్ణాటక సరిహద్దు) వరకు ఇదివరకే రెండు వరసల్లో నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ సరిహద్దు నుంచి బిజాపుర్, మెదక్ సరిహద్దు నుంచి రామసముద్ర, యాద్గిర్ సిటీ నుంచి సిందగీ వయా సహాపుర్ వరకు ఉన్న మార్గాలు జాతీయ రహదారులు కావని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో 14, ఏపీలో 33 జ్యుడిషియల్ కస్టడీ మరణాలు
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబరు 15 వరకు తెలంగాణలో 14 మంది, ఆంధ్రప్రదేశ్లో 33 మంది జ్యుడిషియల్ కస్టడీలో చనిపోయినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ కాలంలో దేశవ్యాప్తంగా పోలీస్ కస్టడీలో 114 మంది, జ్యుడిషియల్ కస్టడీలో 1,451 మంది చనిపోయినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో పోలీసు కస్టడీలో ఎవరూ చనిపోలేదన్నారు.
తెలంగాణ నుంచి 48, ఏపీ నుంచి 126 కిసాన్ రైళ్లు
కిసాన్ రైళ్లు ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు తెలంగాణ నుంచి 48, ఆంధ్రప్రదేశ్ నుంచి 126 సర్వీసులు నడిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!