‘నకిలీ’ సిమ్కార్డులతో నేరాలకు ఊతం
‘‘సిమ్కార్డులు కావాలా తీసుకోండి.. వంద, వెయ్యి.. ఎన్నైనా సరే ఇస్తాం’’ అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ తప్పుడు గుర్తింపు పత్రాలతో పొందిన సిమ్కార్డులను వేలసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఇవి
తప్పుడు కేవైసీలతో పొంది గంపగుత్తగా అమ్మకాలు
విక్రయాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: ‘‘సిమ్కార్డులు కావాలా తీసుకోండి.. వంద, వెయ్యి.. ఎన్నైనా సరే ఇస్తాం’’ అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ తప్పుడు గుర్తింపు పత్రాలతో పొందిన సిమ్కార్డులను వేలసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న సమాచారంతో కేంద్ర నిఘావర్గాలు గతేడాది జనవరి నుంచి నిఘా పెట్టాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఇలాంటి సిమ్కార్డులను వినియోగిస్తున్నారని తెలుసుకున్నాయి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించగా.. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ఆయా రాష్ట్రాల్లో అక్రమంగా సిమ్కార్డులు విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. కొన్ని సెల్ఫోన్ నెట్వర్క్ కంపెనీలు లక్ష్యాలను చేరేందుకు కమీషన్ ఎక్కువగా ఇస్తామంటూ గంపగుత్తగా ఏజెంట్లకు ఇస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
రూట్కాలింగ్ కేంద్రం.. మూడు వేల సిమ్కార్డులు..
హైదరాబాద్, దిల్లీ, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరుల నుంచి విదేశాలకు ఎక్కువగా కాల్స్ వెళ్తున్నాయంటూ కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది.. బెంగళూరుకు సమీపంలోని ఓ సైనిక కార్యాలయం నుంచి దుబాయ్కి ఫోన్కాల్స్ వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీగ లాగితే రూట్కాలింగ్ కేంద్రాల నిర్వాహకులు, సైబర్ నేరస్థులు వేల సంఖ్యలో సిమ్కార్డులను మారుపేర్లలో ఉపయోగిస్తున్నారని తేలింది. వారి పరిశోధన కొనసాగుతుండగానే సికింద్రాబాద్లో రూట్కాలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న ఎర్నాకుళం వాసి మహ్మద్ రసూల్ను హైదరాబాద్ పోలీసులు ఆర్నెల్ల క్రితం అరెస్ట్ చేశారు. దుబాయ్, మస్కట్లతో పాటు ఇతర దేశాలకు ఫోన్కాల్స్ చేస్తున్నాడని గుర్తించారు. రూట్కాలింగ్ నిర్వహణకు అవసరమైన సిమ్కార్డులను ఎక్కడినుంచి తీసుకుంటున్నావని పోలీసులు ప్రశ్నించగా... టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా వివరాలు తెలుసుకుని కొరియర్లో మూడువేల సిమ్కార్డులు పంపిచారని చెప్పాడు. ఈ సమాచారాన్ని పోలీసులు కేంద్ర నిఘావర్గాలకు ఇవ్వగా... ఆ సిమ్కార్డుల ఆధారంగా దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో సిమ్లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలిశాయి. 15 వేల సిమ్కార్డులు వారు సమీకరించుకున్నారని గుర్తించాయి.
ఒక ఆధార్.. పదిహేను కలర్ జిరాక్స్లు..
సిమ్కార్డు ద్వారా వచ్చే కమీషన్కు ఆశపడి అక్రమంగా సిమ్కార్డులను విక్రయిస్తున్న ఏజెంట్లు ఒక ఆధార్కార్డుతో పదీపదిహేను కలర్ జిరాక్స్లు తీసుకుంటున్నారు. అనంతరం ఆయా కార్డుల్లో పేర్లు, ఫొటోలు, చిరునామాలను ఇష్టారాజ్యంగా మార్చి సిమ్కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. వీటిని సైబర్ నేరస్థులు, రూట్కాలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి గంపగుత్తగా అమ్మేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అస్సాం, నాగాలాండ్, మణిపూర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని మారుమూల జిల్లా కేంద్రాలు, నేషనల్ కాపిటల్ రీజియన్లోని మండల కేంద్రాల్లో సిమ్కార్డులు విక్రయిస్తున్న ఏజెంట్లు ఇలా చేస్తున్నారని తేలింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రపదేశ్కు చెందిన సిమ్కార్డులు కూడా హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరెవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పరిశోధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM