రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ నజర్
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికం
ద్విచక్రవాహనాలతో సంభవిస్తున్నవే ఎక్కువ
నివారణ చర్యలపై అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణంలోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. కారణాలను పరిశీలిస్తున్న అధికారులు మిగతా ప్రభుత్వ విభాగాలతో కలిసి నివారణ చర్యలపై అధ్యయనం చేస్తున్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. 2020లో 16,898, 2021లో 19,248 సంభవించాయి. ఇదే సమయంలో మరణాలు 6,033 నుంచి 6,690కి పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ప్రమాదాలు 2,350, మరణాలు 657 పెరిగాయి.
రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
2018 నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి మళ్లీ పెరుగుదల నమోదయింది. లాక్డౌన్ కారణంగా 2020లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. ప్రమాదాలు తగ్గడానికి ఇదే కారణం. అయితే ఇదే సమయంలో ఎవరికివారు సొంత వాహనాలకు మొగ్గు చూపడంతో రాష్ట్రంలో వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. దాని ప్రభావం మరుసటి ఏడాది పడింది. జిల్లాల వారీగా అధికారులు చేసిన అధ్యయనంలో జనవరి నుంచి నవంబరు వరకూ మొదటి 11 నెలల్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో మరణాలు, ప్రమాదాల్లో పెరుగుదల 49 శాతంగా నమోదయింది. ఇదే కాలానికి 2020లో ఇక్కడ 87 మంది మరణించగా 2021 నాటికి 130కి చేరింది. ప్రమాదాలు కూడా 80 నుంచి 119కి పెరిగాయి. మరణాల్లో 36 శాతం, ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో రాజన్నసిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రమాదాలు 78 నుంచి 101కి, మరణాలు 78 నుంచి 106కు పెరిగాయి. ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో వరంగల్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రమాదాలు 302 నుంచి 391కి, మరణాలు 330 నుంచి 412కు పెరిగాయి. అత్యధికంగా సైబరాబాద్ కమిషరేట్లో 741 మంది మరణించారు. తర్వాతి స్థానంలో ఉన్న రాచకొండలో 564, వరంగల్ కమిషరేట్లో 412 మంది కన్నుమూశారు. సైబరాబాద్లో మరణాలు 12 శాతం పెరగ్గా రాచకొండలో 2 శాతం తగ్గాయి.
గ్రామీణంలోనే అధికం ఎందుకంటే...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, మరణాలు భారీగా పెరుగుతుండటంపై పోలీసులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. పట్టణాల్లో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు. వేగం మితిమీరితే సీసీ కెమెరాల ద్వారా చలానాలు విధిస్తుంటారు. కాని గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పర్యవేక్షణ ఈ స్థాయికి చేరుకోలేదు. ప్రమాదాలకు ప్రధాన కారణం ఇదే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామీణ పోలీస్స్టేషన్ల పరిధిలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, మద్యం తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!