తెలంగాణలో పరిశ్రమ స్థాపించండి
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్కు కేటీఆర్ ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించాలని ప్రపంచ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత ఎలన్మస్క్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. భారత్లో సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ట్విటర్ ద్వారా కోరారు. భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలన్మస్క్ శనివారం చేసిన ట్వీట్పై ఆయన ఈ మేరకు స్పందించారు. టెస్లాతో కలిసి పనిచేయడం తమకు సంతోషదాయకమన్నారు. భారత్లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా కారును స్వయంగా నడిపిన ఫొటోను కేటీఆర్ తన ట్వీట్కు జత చేశారు. కారు బాగుందని, ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచించారని అప్పట్లో చేసిన ట్వీట్ను సైతం ఆయన గుర్తు చేశారు. కాగా కేటీఆర్ ఆహ్వానంపై ఎలన్ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, చర్చలు కొలిక్కి రాలేదంటూ ఆయన పేర్కొన్నారు. 2003లో టెక్సాస్లో ప్రారంభమైన టెస్లా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 23 శాతం ఇవి తయారు చేస్తున్నవే. భారత్లో తమ తొలి యూనిట్ను స్థాపించేందుకు గత ఏడాది కాలంగా ఎలన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఫార్ములా ఇ-రేస్ల నిర్వహణపై నేడు ఒప్పందం
తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహనాలతో ఫార్ములా రేస్ జాతీయస్థాయి వార్షిక పోటీల నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. దీని కోసం ఫార్ములా ఇ-అసోసియేషన్తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.
మరో మూడు రాష్ట్రాలూ ఆహ్వానించాయ్..
చండీగఢ్: విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల నేతలూ ఎలన్ మస్క్ను ఆహ్వానించారు. తాను ప్రతిపాదిస్తున్న ‘పంజాబ్ నమూనా’లో లూధియానా నగరం విద్యుత్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమకు హబ్గా ఎదుగుతుందని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని మస్క్ను కోరారు. మహారాష్ట్రలో టెస్లా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి జయంత్ పటేల్ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ గులాం రబ్బానీ కూడా మస్క్కు ఇదే రకమైన ఆహ్వానాన్ని అందించారు.
ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం ఎక్కడుంది?
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా బయట అమెజాన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం ఇదే కావడం గమనార్హం. ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి సైతం కేటీఆర్ ఇలాంటి ప్రశ్న వేసి సమాధానం రాబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
-
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.