డిస్కం నుంచే కాదు.. బయటా కరెంటు కొనుక్కోవచ్చు
విద్యుత్ వాహనాల(ఈవీల)కు ఛార్జింగ్ సదుపాయాలు సులభతరం కానున్నాయి. ‘రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం) నుంచే కాకుండా.. కరెంటు ఛార్జీలు తక్కువగా వసూలు చేసే మరో విద్యుత్ సంస్థ నుంచైనా కొని ఛార్జింగ్ స్టేషన్కు వాడుకోవచ్చు.
హైవేలపై ప్రతి 25 కి.మీ.లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ తప్పనిసరి
విద్యుత్ వాహనాల సదుపాయాలపై కేంద్రం మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ వాహనాల(ఈవీల)కు ఛార్జింగ్ సదుపాయాలు సులభతరం కానున్నాయి. ‘రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం) నుంచే కాకుండా.. కరెంటు ఛార్జీలు తక్కువగా వసూలు చేసే మరో విద్యుత్ సంస్థ నుంచైనా కొని ఛార్జింగ్ స్టేషన్కు వాడుకోవచ్చు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డిస్కంలకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు
* దేశంలో ఎక్కడైనా, ఎవరైనా ‘పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్’(పీసీఎస్) ఏర్పాటు చేయవచ్చు.
* యూనిట్ కరెంటు సరఫరాకు అయ్యే సగటు వ్యయం కన్నా ఎక్కువ ఛార్జీని స్టేషన్ల నుంచి వసూలు చేయకూడదు. 2025 వరకూ ఈ నిబంధనను డిస్కంలు పాటించాలి. తెలంగాణలో ప్రస్తుతం ఈ సగటు వ్యయం రూ.7.14. ఇంతకన్నా ఎక్కువ వసూలు చేయకూడదు.
* పబ్లిక్ స్టేషన్ కోసం తక్కువ ఛార్జీకే బయట మార్కెట్లో ఎవరైనా అమ్మితే ‘ఓపెన్ యాక్సెస్’లో కొనుక్కోవచ్చు. దీనికి దరఖాస్తు చేస్తే డిస్కం 15 రోజుల్లో అనుమతించాలి. ఆ కరెంటును కొన్న కేంద్రం నుంచి స్టేషన్కు సరఫరా చేయాలి. ఇందుకు అదనపు సర్ఛార్జీలు వేయకూడదు.
* జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25 కి.మీ.లకొక పీసీఎస్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకులవారు ముందుకొస్తే అవకాశమివ్వాలి. ప్రతి 3 కి.మీ.ల పరిధిలో ఒక స్టేషన్ ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షలకు మించి జనాభా ఉన్న 9 నగరాల్లో, వాటికి వెళ్లే రహదారులు, హైవేలపై రాబోయే మూడేళ్లలో పీసీఎస్ల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. హైదరాబాద్ నగరంతో పాటు ఓఆర్ఆర్, నగరానికి వచ్చే 5 హైవేలపై పీసీఎస్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
* పీసీఎస్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను ఆదాయం పంచుకునే విధానంలో లీజుకివ్వాలి. స్టేషన్ ఏర్పాటయ్యాక.. అక్కడ వాడే ప్రతి యూనిట్ కరెంటుపై రూపాయి చొప్పున లీజు కిరాయి కింద తీసుకోవాలి. రాష్ట్రస్థాయిలో ఒక ప్రభుత్వ సంస్థకు పీసీఎస్ల ఏర్పాటు బాధ్యతలు అప్పగించాలి.
ఇంట్లోనూ ఛార్జింగ్ చేసుకోవచ్చు
* ప్రజలు తమ ఇంట్లో ఉన్న కనెక్షన్ నుంచే వాహనాలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకు ఇంటి కరెంటు బిల్లులో ఎంత ఛార్జీ వేస్తారో అంతే వసూలు చేయాలి.
* అపార్ట్మెంట్లు, కాలనీలు, కార్యాలయ సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాల ఆవరణల్లో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే.. మెట్రో నగరాల్లో 7, మున్సిపాలిటీల్లో 15, గ్రామాల్లో 30 రోజుల్లోగా కొత్త కరెంటు కనెక్షన్లను డిస్కం ఇవ్వాలి.
* కొత్తగా నిర్మించే భవనాల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ భవన నిర్మాణాల బైలాస్ను పురపాలకశాఖ మార్చాలి.
* పబ్లిక్ స్టేషన్లలో ఛార్జింగ్ కోసం ఆన్లైన్ ద్వారా ముందుగా సమయం బుక్ చేసుకోవడానికి వాహనదారులకు అవకాశం కల్పించాలి.
* ఈవీలో ఉండే బ్యాటరీని ఛార్జింగ్ కోసం తీసుకుని, మరొకటి ఇచ్చే సదుపాయాన్ని స్టేషన్లోకల్పించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు