దొంగలున్నారు జాగ్రత్త!
దొంగతనాలు, సైబర్ మోసాల ద్వారా నిందితులు రాష్ట్రంలో గంటకు రూ.రెండున్నర లక్షలు, రోజుకు రూ.అరకోటిపైనే దోచేస్తున్నారు. సైబర్ నేరాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు తగ్గినట్లు కనిపిస్తున్నా
రాష్ట్రంలో రోజుకు రూ.అర కోటి చోరులపాలు
గతేడాది చోరీ, సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదుల్లో నమోదైన మొత్తం రూ.209 కోట్లు
సైబర్ నేరాలన్నీ కలిపితే పోయింది.. మరో రూ.300 కోట్లకుపైనే
ఈనాడు, హైదరాబాద్: దొంగతనాలు, సైబర్ మోసాల ద్వారా నిందితులు రాష్ట్రంలో గంటకు రూ.రెండున్నర లక్షలు, రోజుకు రూ.అరకోటిపైనే దోచేస్తున్నారు. సైబర్ నేరాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు తగ్గినట్లు కనిపిస్తున్నా మామూలు చోరీలు భయపెడుతూనే ఉన్నాయి. ఇక సైబర్ నేరాలు ఏటికేడు రెట్టింపవుతున్నాయి. మొత్తంగా అప్రమత్తంగా లేకుంటే.. బీరువాలో డబ్బుకే కాదు మెడలో గొలుసుకీ, జేబులో పర్సుకీ, బ్యాంకులో దాచుకున్న సొమ్ముకూ గాలం వేసేవారు అదృశ్యంగా మనచుట్టూనే ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు!!
* గత ఏడాది రాష్ట్రంలో ఆస్తికి సంబంధించిన నేరాల్లో (చోరీలు, దోపిడీలు..) 17,429 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో రూ.113.50 కోట్ల సొత్తు నేరగాళ్ల పాలయింది.
* సైబర్ నేరాల్లో.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్)కు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ప్రజలు నష్టపోయిన సొమ్ము విలువ మరో రూ.95.71 కోట్లు. సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని ఏర్పాటు చేసింది. సైబర్ నేరానికి గురైన వారు 155260 నంబరుకు ఫోన్ చేస్తే బాధితుల వివరాలు తెలుసుకొని కోల్పోయిన సొత్తు తాలూకూ లావాదేవీని నిలిపివేస్తారు.
* పై రెండింటి ప్రకారం గతేడాది రాష్ట్ర ప్రజలు కోల్పోయిన మొత్తం రూ.209.21 కోట్లు. అంటే రోజుకు రూ.57.31 లక్షలు పోగొట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది.
* ఇవికాకుండా.. సైబర్ నేరాలపై అనేక మంది సరాసరి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా బహుమతుల పేరుతో ఆశలు చూపి, పెళ్లి పేరుతో, ఇతరత్రా డబ్బు గుంజేవారికి సంబంధించి.. గత ఏడాది మరో 8,839 కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల్లో కోల్పోయిన మొత్తం రూ.300 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
నగలు, నగదు కొంతమేర స్వాధీనం
* చోరీ అయిన నగలు, నగదుని పోలీసులు కొంతవరకూ తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. గత ఏడాది ఈ సొత్తులో రూ.53.11 లక్షలు (47 శాతం) తిరిగి రాబట్టగలిగారు.
* సైబర్ నేరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. నిందితులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటుండటంతో వారిని గుర్తించడం, అరెస్టు చేయడం, సొత్తు రాబట్టడం సాధ్యం కావడంలేదు. కొంతమేరకు ఆయా బ్యాంకు లావాదేవీలను నిలిపివేయగలుగుతున్నారు. ఇలా గత ఏడాది రూ.5.11 కోట్ల నగదు లావాదేవీలను నిలుపు చేయగలిగారు. పోగొట్టుకున్న సొమ్ములో ఇది 5 శాతం మాత్రమే. ఇది కూడా బాధితులకు అందేవరకూ గ్యారంటీ లేదు.
ముందు జాగ్రత్తలే ముఖ్యం
కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఇంట్లో ఎక్కువ నగదు, నగలు ఉంచవద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా పలువురు దీన్ని పాటించడంలేదు. మాయమాటలతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలేవీ ఇతరులతో పంచుకోవద్దని.. గుర్తింపులేని, అపరిచిత వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్