92 శాతం కేసులు ఒమిక్రాన్వే
రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం ఈ వేరియంట్వేనని తేటతెల్లమైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 90
జీహెచ్ఎంసీ నమూనాల్లో వెల్లడి
రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్ కేసులు
ఎర్రగడ్డ ఆసుపత్రిలో 57 మంది మానసిక రోగులకు పాజిటివ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం ఈ వేరియంట్వేనని తేటతెల్లమైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా.. వాటిలో 7(7.7%) మాత్రమే డెల్టా వేరియంట్ కేసులు కాగా 83(92.3%) పాజిటివ్లు ఒమిక్రాన్కు సంబంధించినవని నిర్ధారణ అయింది. ఒమిక్రాన్లోనూ ‘బిఎ1’కు చెందినవి 15, ‘బిఎ2’కు చెందినవి 64, ‘బి.1.1.529’కు చెందినవి 4గా వెల్లడైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ‘బిఎ2’ రకం ఒమ్రికాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లు అర్థమవుతోందని వైద్యవర్గాలు తెలిపాయి.
కొవిడ్ కోరల్లో వైద్య సిబ్బంది
ఒమిక్రాన్ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కొవిడ్ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
22 వేలు దాటిన క్రియాశీల కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 3 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 4,060 మంది కన్నుమూశారు.వైరస్ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2,295 మంది కోలుకోగా మొత్తంగా 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80,138 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 3,07,09,658కి పెరిగింది. మరో 10,732 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 పాజిటివ్లుండగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డిలో 183, హనుమకొండలో 80, సంగారెడ్డిలో 73, మంచిర్యాలలో 68, ఖమ్మంలో 63, నిజామాబాద్లో 55 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో పాజిటివ్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,68,897 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో 69,900 మంది తొలి డోసును, 1,80,065 మంది రెండో డోసును, 18,932 మంది ముందస్తు నివారణ డోసును స్వీకరించారు.
ఆసుపత్రిలో చేరిన భట్టి
గాంధీభవన్, న్యూస్టుడే: కరోనా బారినపడి స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు, పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని పార్టీ శాసనసభాపక్షం కోరింది. మరో వైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మహేశ్వర్రెడ్డికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
సింగరేణిలో 913 మందికి కొవిడ్
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి వ్యాప్తంగా సోమవారం నాటికి 913 మంది కరోనా పాజిటివ్ రోగులున్నారని, వీరిలో 382 మంది ఉద్యోగులని సంస్థ సంచాలకులు బలరాం, చంద్రశేఖర్ సోమవారం వెల్లడించారు. మిగిలిన వారిలో 415 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మరో 116 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబీకులకు టీకాలు పూర్తయినందున బాధితుల్లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని వెల్లడించారు.
భద్రాద్రి జిల్లాలో 23 మంది పోలీసులకు..
భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సబ్ డివిజన్కు చెందిన 150 మంది పోలీసులు బందోబస్తు విధులకు హాజరయ్యారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఒక శిక్షణ ఎస్సై సహా మొత్తం 23 మంది కరోనా బారిన పడ్డారు.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం
అమీర్పేట, న్యూస్టుడే: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని కరోనా కమ్మేస్తోంది. ఆసుపత్రిలోని మేల్ క్లోజ్డ్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 57 మంది రోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు మరో 9 మంది పీజీ వైద్య విద్యార్థులు కూడా కరోనా బారిన పడ్డారు. అప్రమత్తమైన ఆసుపత్రి వైద్యాధికారులు మొత్తం రోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. స్వల్పంగా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో మొత్తం 297 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. 170 మంది వరకు అన్ని స్థాయిల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. మంగళవారం ఫిమేల్ క్లోజ్డ్ వార్డుల్లో రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ మాట్లాడుతూ.. పాజిటివ్గా తేలినవారిలో 10 మందికే స్వల్ప లక్షణాలున్నాయని, మిగిలిన వారికి ఎలాంటి లక్షణాలూ లేవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ