విడిపోయిన ధనుష్‌, ఐశ్వర్య దంపతులు

నటుడు ధనుష్‌, ఐశ్వర్య వైవాహిక జీవితం నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్‌లకు 2004లో వివాహమైంది. వీరికి

Published : 18 Jan 2022 04:22 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: నటుడు ధనుష్‌, ఐశ్వర్య వైవాహిక జీవితం నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్‌లకు 2004లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు (యాత్ర, లింగా) ఉన్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితంలో అన్యోన్యంగానే జీవనం సాగిస్తూ వచ్చారు. ఇటీవల ధనుష్‌ జాతీయ అవార్డును అందుకునే కార్యక్రమానికి కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తాము విడిపోతున్నట్లు ధనుష్‌, ఐశ్వర్యలు ట్విటర్‌లో తాజాగా ఉమ్మడి సందేశాన్ని విడివిడిగా ట్వీట్‌ చేశారు. ‘18 ఏళ్ల పాటు స్నేహితులు, దంపతులు, తల్లిదండ్రులుగా అర్థం చేసుకుని జీవించాం. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి జీవించాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవిస్తారని అందర్నీ కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌లో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు