సచివాలయంలో కరోనా కలకలం
ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర సచివాలయం(బీఆర్కే భవన్)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్ బారినపడ్డారు. ఐఏఎస్ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య
అయిదుగురు ఐఏఎస్లు సహా 30 మందికి వైరస్
పోలీసుశాఖలో భారీగా బాధితులు
వివిధ శాఖల్లోనూ అదే పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర సచివాలయం(బీఆర్కే భవన్)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్ బారినపడ్డారు. ఐఏఎస్ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య, రెవెన్యూ, విద్యాశాఖలోని అధికారులు, ఉద్యోగులు 30 మందికి వైరస్ సోకింది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రవాణా, రోడ్లు భవనాల కార్యదర్శి శ్రీనివాస్రాజు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్విలతో పాటు ఆర్థికశాఖ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ శివశంకర్లకు పాజిటివ్ తేలింది. ఇప్పటికే జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజు హోం ఐసొలేషన్లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు అధికమవుతుండడంతో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. మహమ్మారి బారినపడ్డ వారంతా సెలవుపై వెళ్తుండటం, క్వారంటైన్ పూర్తయ్యే వరకూ విధులకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
పోలీసుశాఖ విలవిల
పోలీసుశాఖ కరోనాతో విలవిలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో 150, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ డీఐజీ స్థాయి అధికారితో పాటు దాదాపు 300, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 350 మంది వరకూ వైరస్ బారినపడ్డారు. వరంగల్ కమిషనరేట్లో ముగ్గురు ఏసీపీలు, నలుగురు సీఐలతో సహా 99 మంది, రామగుండం పోలీసు కమిషనరేట్లో ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలతో సహా 68 మంది, వివిధ జిల్లాలో పదుల సంఖ్యలో పోలీసులకు పాజిటివ్ తేలింది. బాధితులకు ఆసరాగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో సహాయక నంబర్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు.
ఇతర శాఖల్లో..
పోలీసుశాఖ తర్వాత ఎక్కువ మంది బాధితులైంది ఆరోగ్యశాఖలోనే.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైద్యులతో పాటు వైద్య విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భారీగా దీని బారిన పడ్డారు. మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యాశాఖలోనూ అనేక మందికి కరోనా సోకింది. శాఖ కార్యదర్శి సుల్తానియాతో పాటు ఇంటర్బోర్డు, ఇంటర్ విద్యాశాఖలో 15 మంది మహమ్మారి బారినపడ్డారు. క్షేత్రస్థాయిలో పదుల సంఖ్యలో టీచర్లకు పాజిటివ్గా తేలింది. ఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్ సంచాలకులు సహా 75 మంది, ట్రాన్స్కోలో 22, వ్యవసాయ కమిషనరేట్లో 10 మంది, ఉద్యాన కమిషనరేట్లో ఇద్దరు మహమ్మారి బారినపడ్డారు. సింగరేణిలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కలిపి 951 మంది, నీటిపారుదలశాఖలో పదిమంది ఇంజినీర్లు కొవిడ్తో బాధ పడుతున్నారు.
ఎమ్మెల్యే గండ్ర దంపతులకు పాజిటివ్
ఈనాడు, వరంగల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి జిల్లాలో పర్యటించగా.. వెంట వీరూ ఉన్నారు. వెంకటరమణారెడ్డి.. మంత్రి నిరంజన్రెడ్డితో పాటే హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్గా తేలింది.
ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్లు
7 నెలల తర్వాత ఇదే అత్యధికం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూడోదశ ఉద్ధృతి ప్రారంభమైన తర్వాత మంగళవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,14,639కి పెరిగింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు కొవిడ్ బారినపడ్డారు. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలున్నాయని, ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకేరోజులో లక్ష దాటిన పరీక్షలు
మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకూ 4,062 మంది కన్నుమూశారు. తాజాగా 2,706 మంది చికిత్స పొంది కోలుకోగా మొత్తంగా 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. వైరస్ బారిన పడి ప్రస్తుతం రాష్ట్రంలో 22,472 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 నమూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,08,17,562కు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా జీహెచ్ఎంసీలో మాత్రం అనూహ్యంగా అధికమవుతున్నాయి. తాజాగా ఇక్కడ 1,206 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డిలో 227, హనుమకొండలో 118, సంగారెడ్డిలో 96, పెద్దపల్లిలో 81, ఖమ్మంలో 77, నిజామాబాద్లో 76, మంచిర్యాలలో 75, భద్రాద్రి కొత్తగూడెంలో 65, నల్గొండలో 61, వికారాబాద్లో 50 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్, నాగర్కర్నూల్, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మరో 2,93,843 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల మధ్యవయస్కుల్లో ఇప్పటి వరకూ 9,63,864(అర్హుల్లో 52 శాతం) మంది టీకాలను పొందారు.
* భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మంగళవారం 100 మందికి పరీక్షలు చేయగా 57 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సింగరేణి ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ తెలిపారు. వీరిలో తనతో పాటు మరో నలుగురు సిబ్బంది, కార్మికులు కూడా ఉన్నారన్నారు.
* ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో మరో అయిదుగురు రోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆసుపత్రిలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 71కి చేరింది.
ఏపీలో కొత్తగా 6,996 మందికి వైరస్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా జరిగినందువల్లే కేసులు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. సోమవారం 4,018 (17.95%) కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి కొత్త కేసులు 7 వేలకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకుంది.
చంద్రబాబుకు కరోనా
తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతా సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్లు ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం