వద్దు నిర్లక్ష్యం
కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే..
3-5 రోజులైనా తీవ్రత తగ్గకపోతే ఆసుపత్రిలో చేరక తప్పదు
స్వల్ప లక్షణాలుంటే మాత్రం ఇంటి వద్దే చికిత్స
10 రోజుల్లోపే రెమ్డెసివిర్ అందజేస్తే మెరుగైన ఫలితం
కరోనా చికిత్సపై ఐసీఎంఆర్- ఎయిమ్స్ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలు 3 శాతం పెరిగాయి. తొలుత స్వల్ప లక్షణాలతో మొదలైనా.. కొందరిలో 5-6 రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చికిత్సపై ప్రజలకు అవగాహన అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి? తదితర మార్గదర్శకాలను ఐసీఎంఆర్-దిల్లీ ఎయిమ్స్లు సంయుక్తంగా విడుదల చేశాయి.
కొవిడ్పై నిర్లక్ష్యం తగదు
కొవిడ్ను ఐసీఎంఆర్ మూడు దశలుగా విభజించింది. స్వల లక్షణాలతో కూడిన వ్యాధి.. మధ్యస్థ వ్యాధి.. తీవ్ర వ్యాధిగా పరిగణించి.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వీటిని పాటించడం ద్వారా కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్ప వ్యాధి
లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి
చికిత్స: ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. తేలికపాటి దగ్గు, జ్వరం ఐదు రోజులకు మించి వస్తుంటే.. వైద్యుడి సలహా మేరకు ఔషధాలను వాడాలి.
జాగ్రత్తలు
* భౌతిక దూరం పాటించాలి.
* ఇంట్లోనూ మాస్కు ధరించాలి.
* నీళ్లు తగినంతగా తాగాలి.
* రోజుకు 3సార్లు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ పరీక్షించుకోవాలి.
ఎప్పుడు అత్యవసరం?
* శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు
* ఆక్సిజన్ శాతం 93 కంటే తగ్గినప్పుడు
* జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు
* 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైతే 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు
ఎవరికి ఎక్కువ ముప్పు?
60 ఏళ్లు దాటినవారు, మధుమేహులు, ఊబకాయులు, గుండె రక్తనాళాల జబ్బు, అధిక రక్తపోటు హెచ్ఐవీ, క్షయ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ జబ్బులు, మెదడు, రక్తనాళాల జబ్బులతో చికిత్స పొందుతున్నవారు
మధ్యస్థ వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ 90-93 శాతం మధ్యలో ఉండడం.
చికిత్స: * ఈ తరహా లక్షణాలున్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందించాలి.
* రక్తంలో ఆక్సిజన్ శాతం కనీసం 92-96 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
* కృత్రిమ ప్రాణవాయువును అందించాలి.
* స్టెరాయిడ్ చికిత్సను ఆసుపత్రిలోనే ప్రారంభించి, అక్కడే ముగించాలి. ఇంటికెళ్లాక కూడా స్టెరాయిడ్ వాడే విధానానికి స్వస్తి పలకాలి.
* దీర్ఘకాలం, అవసరానికి మించి స్టెరాయిడ్ చికిత్సను వినియోగించడం వల్ల మ్యూకర్ మైకోసిస్ తదితర జబ్బుల బారినపడే ప్రమాదముంది.
జాగ్రత్తలు
* శ్వాస తీరు ఎలా ఉందో పరీక్షిస్తూ ఉండాలి.
* ఆరోగ్య పరిస్థితి క్రమేణా క్షీణిస్తుంటేనే.. ఛాతీ ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాలి.
* 2-3 రోజులకోసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
తీవ్ర వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, తీవ్ర ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తగ్గిపోవడం.
చికిత్స: * ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాలి.
* పరికరాల ద్వారా ప్రాణవాయువును ఇవ్వాలి.
* వైద్యుడి సూచనల మేరకు స్టెరాయిడ్ ఔషధాలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ చికిత్సను అందించాలి.
జాగ్రత్తలు
* నిర్ధారణ పరీక్షలను రోజూ చేయించనక్కర్లేదు. 2-3 రోజులకొకసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
* దగ్గు 2-3 వారాల కంటే ఎక్కువగా వేధిస్తుంటే.. క్షయ ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించడం ముఖ్యం.
రెమ్డెసివిర్ ఎప్పుడు?
లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోపు రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలున్న వారికి, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న వారికే ఇవ్వాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి, ప్రాణవాయువు అవసరం లేని వారికి ఇది ఇవ్వనక్కర్లే ేదు. వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న వారికి రెమ్డెసివిర్ ఇవ్వకూడదు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కిడ్నీ, లివర్ పరీక్షలు చేయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా