ఆలోచనలే పెట్టుబడి.. లాభసాటిగా సాగుబడి
ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ.. నష్టపోతున్న అన్నదాతలు విభిన్న పంటలపై దృష్టి సారిస్తే లాభాల బాట పట్టొచ్చు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన దిగుబడులకు మంచి డిమాండ్ ఉంటోంది. పండించిన పంటలను సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోవడమూ అవసరమే.
విభిన్న పంటల సాగు.. ఆపై సొంతంగా విక్రయాలు
మహబూబాబాద్ జిల్లా రైతుల స్ఫూర్తి
ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ.. నష్టపోతున్న అన్నదాతలు విభిన్న పంటలపై దృష్టి సారిస్తే లాభాల బాట పట్టొచ్చు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన దిగుబడులకు మంచి డిమాండ్ ఉంటోంది. పండించిన పంటలను సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోవడమూ అవసరమే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన ఓ రైతు ప్రకృతి సేద్య విధానంలో 13 ఎకరాల్లో పలు రకాల పసుపు, వరి, కందితోపాటు అంతర పంటలూ పండిస్తున్నారు. వాటిని స్వయంగా విక్రయిస్తున్నారు. డోర్నకల్కు చెందిన రైతులు పంటల ఉత్పత్తుల విక్రయాలకు యాప్ను, మార్ట్నూ ఏర్పాటు చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు ‘సాగు’తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్ఫూర్తి పంచుతున్నారు.
18 రకాల పసుపు.. 5 రకాల వరి
కల్వల రైతు ప్రకృతి సేద్యం
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గంట దామోదర్రెడ్డి(69) సేద్యంలో వైవిధ్యం చాటుతున్నారు. తొలుత మూడేళ్లు అరెకరంలో పెసర, వేరుసెనగ సాగు చేసేవారు. 13 ఏళ్లుగా ఆరెకరాల సొంత భూమి, ఏడెకరాల కౌలు భూమిలో 18 రకాల పసుపు, 5 రకాల వరి, 3 రకాల కంది పండిస్తున్నారు. వేరుసెనగ, నువ్వులు, పప్పుదినుసులూ సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా మినుము, పెసర, మిరప వేస్తున్నారు. 25 గుంటల్లో ఎరుపు(దేశీయ), నలుపు, మచ్చల కంది, గుంట స్థలంలో చేమదుంప వేశారు. పాలేకర్ విధానంలో జీవామృతం, కషాయాలను తయారు చేసుకుని పంటలకు వాడుతున్నారు. పంట ఉత్పత్తులను సొంతంగానే విక్రయిస్తున్నారు.
పసుపు పొడి విక్రయించి..
ఒకటిన్నర ఎకరాల్లో 18 రకాల పసుపు సాగు చేస్తున్నారు. కస్తూరి, 848, ప్రతిభ, రాజపురి, పీతాంబరి, ఎరుపు దుగ్గిరాల, సుగంధ, మామిడి అల్లం తదితరాలు ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి విత్తనాలు తెప్పించారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే.. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొడి చేసి విక్రయిస్తే.. పెట్టుబడి పోను రూ.14 లక్షలు మిగులుతోందని దామోదర్రెడ్డి తెలిపారు.
దేశీయ వరి
దామోదర్రెడ్డి 3.5 ఎకరాల్లో ఎరుపు, నల్లపు, చెఖోవాతో పాటు చిట్టిముత్యాలు, బాస్మతి వరి సాగు చేస్తున్నారు. ఎరుపు వరి, బాస్మతి రకాలను ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. బియ్యాన్ని కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు.
ఆర్డర్లపై అమ్మకాలు..
పసుపును కేసముద్రంలోని మిల్లుల్లో పొడి పట్టిస్తున్నారు. పెసర, మినుము, కందులను స్వయంగా విసురురాయితో ఇంటి వద్దే పప్పుగా మార్చి.. కిలో ప్యాకెట్లను తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో 5వేల మందికి, దుబాయ్, అమెరికా ప్రాంతాల్లోని 30 మందికి పంపుతున్నారు. ఫోన్, వాట్సప్, ఎస్ఎంఎస్ల రూపంలో ఆర్డర్లు స్వీకరించి.. కొరియర్, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతుంటారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో ఏటా నిర్వహించే అగ్రి ఎక్స్పోలో స్టాళ్లు పెట్టి వాటిలోనూ విక్రయిస్తుంటారు.
‘యాప్’తో లాభాల పంట!
ఖమ్మంలో రైతుల ‘కిసాన్ మార్ట్’
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: పంటలు పండించడంలోనే కాదు.. విక్రయంలోనూ విజయపథంలో సాగుతున్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలేనికి చెందిన రైతులు. 2020 నవంబరులో మిరప ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో)ను ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 303 మంది సభ్యులుగా ఉన్నారు. అప్పుడే యాప్ను అందుబాటులోకి తెచ్చి.. దాని ద్వారా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు, బియ్యం, డ్రైఫ్రూట్స్ల విక్రయాలు ప్రారంభించారు. అవసరమైన సరకుల్ని ఆర్డర్ చేస్తే.. వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు.
రైతుల వద్దే కొనుగోలు
2021 జనవరిలో ఖమ్మంలో కిసాన్ మార్ట్ను ప్రారంభించారు. ఇందులో విక్రయించే 80 శాతం సరకులను రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. కందులు, పెసర్లు, బొబ్బర్లు, మినుములను మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనుగోలు చేసి.. ఖమ్మంలోని మిల్లుల్లో మర ఆడిస్తున్నారు. రైతుల వద్ద సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యం పట్టించి అమ్ముతున్నారు. నెలకు టన్ను బియ్యం విక్రయిస్తున్నారు. కారం, పసుపు, మునగాకు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గోరింటాకు పొడులను మహిళలతో తయారు చేయించి అమ్ముతున్నారు.
రూ.60 లక్షల మూలనిధి
-రామారావు, కిసాన్మార్ట్ మిరప ఉత్పత్తిదారుల సంస్థ ఛైర్మన్
ప్రస్తుతం సంస్థ మూలనిధి సుమారు రూ.60 లక్షలు ఉంది. ప్రతి నెలా నిర్వహణ, సరకుల కొనుగోలు ఖర్చులు పోనూ రూ.50 వేల లాభం వస్తోంది. వేసవిలో 3టన్నుల మామిడిని, మునగాకు పొడిని అమెరికాకు పంపించాం. ప్రభుత్వం సహకారం అందిస్తే విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. యాప్ను 10వేల మంది వినియోగిస్తున్నారు. ప్లేస్టోర్లో ‘కిసాన్మార్ట్ ఖమ్మం’ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల