ఇంటింటా జ్వర సర్వే
తేలికపాటి జ్వరం, దగ్గు, ఆయాసం ఉంటే.. ఆరోగ్య ఉపకేంద్రానికి గానీ.. సమీపంలోని ఆసుపత్రులకుగానీ వెళ్లాలి. హోం ఐసొలేషన్ కిట్లు వాడడం ద్వారా 99 శాతం మందిలో కరోనా తగ్గుతుంది.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించనున్న వైద్య సిబ్బంది
లక్షణాలున్న వారికి అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేత
కోటి కిట్లు సిద్ధమన్న మంత్రి హరీశ్రావు
కిట్లో ఔషధాలను ఎలా వాడుకోవాలో సూచించే కరపత్రాన్ని చూపిస్తున్న హరీశ్రావు
తేలికపాటి జ్వరం, దగ్గు, ఆయాసం ఉంటే.. ఆరోగ్య ఉపకేంద్రానికి గానీ.. సమీపంలోని ఆసుపత్రులకుగానీ వెళ్లాలి. హోం ఐసొలేషన్ కిట్లు వాడడం ద్వారా 99 శాతం మందిలో కరోనా తగ్గుతుంది. ఎవరికైనా తీవ్రమైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఏఎన్ఎంలకు ఆదేశాలిచ్చాం. వెంటిలేటర్లను జిల్లా, ఏరియా ఆసుపత్రుల స్థాయికి తీసుకెళ్లాం. చిన్న పిల్లల కోసం అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, వెంటిలేటర్లు ఏర్పాట్లు చేశాం. వారికి సంబంధించిన మందులు ఉన్నాయి. అన్ని స్థాయుల ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ప్రైవేటుకు వెళ్లొద్దు.
- మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రెండోదశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన అనుభవం ఉండడంతో.. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలున్న వారికి ఎక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కోటి ఔషధ కిట్లను అన్ని ఆసుపత్రులకు పంపించారు. ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న వారిని వైద్యసిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ లక్షణాలు తీవ్రమైతే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ టి.గంగాధర్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆ సంస్థ ఎండీ చంద్రశేఖరరెడ్డిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలక, పంచాయతీరాజ్, వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇతర శాఖల సమన్వయంతో
‘‘రాష్ట్రంలో రెండోదశ కొవిడ్ ఉద్ధృతిలో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, హోం ఐసొలేషన్ కిట్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నీతిఆయోగ్, ఎకనామిక్ సర్వే రిపోర్టు కూడా ప్రశంసించాయి. ఇదే స్ఫూర్తితో వైద్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఈ సర్వే కూడా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ‘‘అవ్వా పాణం ఎట్టుందే..ఓ పెద్దమనీషీ ఆరోగ్యం మంచిగుందా’’ అంటూ వైద్య సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతారు. వివరాలు సేకరిస్తారు. అవసరమైన వారికి ఔషధ కిట్లు, మందులు ఎలా వాడుకోవాలో సూచించే కరపత్రం ఇస్తారు. అందుకోసం రాష్ట్రంలో రెండు కోట్ల నిర్ధారణ పరీక్షల కిట్లను, కోటి హోం ఐసొలేషన్ కిట్లను సిద్ధం చేశాం. వాస్తవానికి ప్రస్తుతం టెస్టింగ్ కిట్లు మార్కెట్లో పెద్దగా లేవు. పైగా ధరలు పెరిగాయి. హోం ఐసొలేషన్ కిట్లలో ఉండాల్సిన మందులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పూర్తిస్థాయిలో వీటిని సమకూర్చుకుంది.ప్రజల వద్దకే ఆరోగ్య అధికారులు వెళ్లి మందులు ఇస్తారు. అన్ని రాష్ట్రాలు కూడా మనం అనుసరిస్తున్న పద్ధతిని పాటించాలని కేంద్రం సూచించింది.
ఆదివారాలు కూడా సేవలు
కరోనా తీవ్రత దృష్ట్యా ఆదివారాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ బస్తీ దవాఖానాల్లో సేవలు లభ్యమవుతాయి. ఎంతమంది వస్తే అంతమందికీ పరీక్షలు చేయాలని ఆదేశాలిచ్చాం. వాస్తవానికి వ్యాధి లక్షణాలున్న వారికే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. వారికే చికిత్సలు చేయాలని స్పష్టం చేసింది. శాసనసభ్యులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జ్వర సర్వేలో పాల్గొనాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలకూ ప్రాణవాయువు సౌకర్యం కల్పించాం. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ స్వీయ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాం. ఇప్పటికే 340 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ సామర్థ్యం పెరిగింది. 500 మెట్రిక్ టన్నుల వరకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 56 వేల కొవిడ్ పడకలుండగా ఒక్క శాతం వినియోగంలో ఉన్నాయి.
ప్రైవేటులో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు
ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన ధర (ఆర్టీపీసీఆర్కు రూ.500)కంటే ఎక్కువ వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా నేపథ్యంలో మేడారం జాతరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. వ్యాక్సినేషన్ కాలపరిమితిని తగ్గించాలని, అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. బూస్టర్ డోస్కు 9 నెలల కాలపరిమితి వల్ల సమస్య వస్తోంది. రాష్ట్రంలో తొలిడోసు వంద శాతం పూర్తయింది. కానీ కాలపరిమితి ఎక్కువగా ఉండటంతో రెండోడోసు పూర్తి కాలేదు’’ అని మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు