రెండు భాగాలుగా ఒక్కో పాఠ్య పుస్తకం
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడి సంచి బరువు పెరగకుండా మార్గం
భాషా సబ్జెక్టులు తప్ప మిగిలినవి రెండుగా ముద్రణ
సర్కారు బడుల్లో విద్యార్థులకు పంపిణీ
విక్రయ పుస్తకాలు మాత్రం యథావిధిగానే
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టర్మ్-1కు ఒక పుస్తకం, టర్మ్-2కు మరో పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 1-7 తరగతుల విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒకే పాఠ్య పుస్తకం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉండాలని, ఒక వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లం ఉండేలా ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకరకాల పుస్తకాలు, మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సామగ్రితో బడి సంచి బరువు అధికంగా ఉంటోంది. ఈ విషయం సర్వేలోనూ స్పష్టమైంది. ఈ క్రమంలో తెలుగు, ఆంగ్లం రెండు భాషలతో పుస్తకాలను ముద్రించి ఇస్తే సంచి బరువు భారీగా పెరుగుతుందని, అది అంతిమంగా విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం 1-10 తరగతులకు పరీక్షలు కూడా సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-1, సమ్మేటివ్ అసెస్మెంట్-2 పేరిట జరుపుతున్నారు. కాకపోతే ఎస్ఏ-1కు సగం సిలబస్ ఉంటుంది. ఎస్ఏ-2కు మొత్తం సిలబస్తో పరీక్షలు జరుపుతారు. అదేవిధంగా ఎస్ఏ-1 సిలబస్కు ఒక పాఠ్య పుస్తకం, ఎస్ఏ-2కు మిగిలిన పాఠ్య ప్రణాళికతో మరో పుస్తకాన్ని టర్మ్-1, 2 పేరిట విద్యా శాఖ ముద్రించి ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)లో ఫైనల్ ప్రూఫ్ను సిద్ధం చేస్తున్నారు. అధికారులు తుది సీడీలను అప్పగిస్తే త్వరలోనే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణా విభాగం పుస్తకాల ముద్రణ ప్రారంభించనుంది.
భాషేతర పుస్తకాలు మాత్రమే
ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు, 3-5వ తరగతి వరకు వాటికి అదనంగా పరిశీలన విజ్ఞానం, గణితం సబ్జెక్టు ఉంటుంది. 6, 7 తరగతుల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు గణితం, జనరల్ సైన్స్, సాంఘికశాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో భాషాపరమైన తెలుగు, ఆంగ్లం, హిందీ లాంటివి ఏ మాధ్యమం వారికైనా పుస్తకాలు ఒకటే. ఇక మిగిలిన సబ్జెక్టు పుస్తకాలను మాత్రమే రెండు మాధ్యమాల్లో, రెండు పుస్తకాలుగా ముద్రించి ఇస్తారు.
మరో 50 లక్షల పుస్తకాలు అధికం!
ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతులు చదివే సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు 1.45 కోట్ల పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నారు. ఇప్పుడు రెండు పుస్తకాల విధానం వల్ల 1-7 తరగతుల కోసం కనీసం మరో 50 లక్షలు పుస్తకాలను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు వాటిని గతంలో మాదిరిగానే ముద్రిస్తారు. ప్రైవేట్లో ప్రస్తుతం 97 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.