ఏపీలో కదం తొక్కిన ఉపాధ్యాయులు
పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల
నిర్బంధాలను ఛేదించి కలెక్టరేట్ల ముట్టడి
పీఆర్సీ ఉత్తర్వులకు నిరసన
ఏలూరులోని కలెక్టరేట్ ముట్టడికి తరలి వచ్చిన ఉపాధ్యాయులు
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్ పీఆర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. నిరసనల్లో మహిళా ఉపాధ్యాయులు ముందు భాగాన నిలిచి పాటలతో గళమెత్తారు. ఫ్యాప్టో (ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ఉపాధ్యాయులు ముట్టడించారు. బుధవారం రాత్రి నుంచే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ సంఘ నేతల ఇళ్లకు వెళ్లి ఆందోళనల్లో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు. రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని తనిఖీ చేసి మధ్యలోనే దించేశారు. అయినా నిర్బంధాలను ఛేదించుకుంటూ భారీ ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు లాగి వాహనాల్లో పడేయడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కడపలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని పోలీసులు లాక్కెళ్లడంతో స్పృహతప్పి పడిపోయారు. చొక్కా చిరిగిపోయింది.
గుంటూరు కలెక్టరేట్ దిగ్బంధం
భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు గుంటూరు కలెక్టరేట్ను ముట్టడించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దిగ్బంధించారు. పోలీసులు ముందే అడ్డుకుంటారనే ఆలోచనతో... ప్రణాళిక ప్రకారం రెవెన్యూ కల్యాణ మండపం, ఎన్జీవో కల్యాణ మండపం, జడ్పీ ప్రాంగణానికి విడివిడిగా చేరుకునేలా వ్యూహం రచించారు. మూకుమ్మడిగా తరలివచ్చి కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
* ఉపాధ్యాయుల ఆందోళనతో కర్నూలు కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసింది. ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకున్న ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కొందరు ప్రధాన ద్వారం ఎక్కి లోపలకు దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులను, ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
అన్ని దారులు మూసేసినా...
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్కు వచ్చే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసినా, ఉపాధ్యాయులు లక్ష్మీటాకీస్ సెంటరు వరకు దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. వాగ్వాదం, తోపులాటలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
* కడపలో వేలాది మంది ఉపాధ్యాయుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని వెళ్లే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.
* ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చిసెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
* చిత్తూరులో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.
* అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
* విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎద]ుట పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య పెనుగులాట జరిగి, కొందరు కిందపడ్డారు.
ఉపాధ్యాయ సంద్రంగా ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు సమీపంలోని జడ్పీ కార్యాలయం రహదారి వరకు అన్ని ప్రాంతాలు ఉదయం 9గంటలకే కిక్కిరిశాయి. ప్రధానవీధుల్లో ఎటు చూసినా ఉపాధ్యాయ సమూహాలే కన్పించాయి. పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
కిటకిటలాడిన కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వేలాది మంది ఉపాధ్యాయులతో కిటకిటలాడింది. ఓ ఉపాధ్యాయుడ[ు తల కిందికి కాళ్లు పైకి పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గీతాలు ఆలపిస్తూ.. నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్