రిజర్వేషన్లు.. ప్రతిభకు విరుద్ధం కాదు
నీట్- పీజీ, యూజీ సీట్లకు రిజర్వేషన్లలో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్.. ప్రతిభకు విరుద్ధం కాదంది. అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్,
నీట్లో ఓబీసీ కోటాను సమర్థించిన సుప్రీంకోర్టు
21-22 విద్యా సంవత్సర ప్రవేశాలకు అనుమతి
దిల్లీ: నీట్- పీజీ, యూజీ సీట్లకు రిజర్వేషన్లలో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్.. ప్రతిభకు విరుద్ధం కాదంది. అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్కు 10% కోటా కల్పించడం రాజ్యాంగ బద్ధమేనని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం గురువారం పేర్కొంది. కొన్ని తరగతులు పొందే ఆర్థిక- సామాజిక ప్రయోజనాన్ని పోటీ పరీక్ష ప్రతిబింబించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో రిజర్వేషన్లు ఇచ్చేముందు ఇకపై సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం నీట్ పీజీ ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతించింది. ‘‘పనితీరుకు సంబంధించిన సంకుచిత నిర్వచనాలతో ప్రతిభను కుదించలేరు. ఇప్పటికీ కరోనా మన మధ్య ఉంది. వైద్యుల్ని నియమించడంలో ఎంతమాత్రం ఆలస్యమైనా పరిస్థితిని ఎదుర్కోవడంపై అది ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి జాప్యం లేకుండా అడ్మిషన్ల ప్రక్రియను, కౌన్సిలింగ్ను అనుమతించాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికను పిటిషనర్లు సవాల్ చేశారు. దీనిపై సవివరంగా అన్ని పక్షాల వాదనల్ని వినాలి. అయితే పిటిషన్ పెండింగులో ఉండడం వల్ల కౌన్సిలింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యం దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతించాలని మేం భావిస్తున్నాం. నిబంధనలు ఏకపక్షమని న్యాయస్థానం భావిస్తే తప్ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. అందువల్ల 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించడానికి అనుమతిస్తున్నాం’’ అని పేర్కొంది.
కోటాతో అవకాశాలు లభిస్తాయి
‘‘బహిరంగ పరీక్షల ద్వారా అభ్యర్థులందరికీ పోటీలో సమాన అవకాశాలు లభిస్తే, ఆ అవకాశాలు వెనుకబడిన తరగతులూ పొందేందుకు రిజర్వేషన్లు వీలు కల్పిస్తాయి. సాధారణంగా వ్యవస్థీకృత అడ్డంకుల వల్ల వారికి కొన్ని అవకాశాలు అందవు. హక్కులు, అవకాశాలకు దూరమైనవారికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గం. రిజర్వేషన్ అనేది ప్రతిభకు అడ్డంకి కాదు. అది ప్రభావశీల పంపిణీని ప్రోత్సహిస్తుంది. విద్యారంగంలో ఉన్న సదుపాయాలు పొందడంలో ఉన్న అసమానతల వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఇతరులతో సమర్థంగా పోటీ పడలేరు. రిజర్వేషన్లు వంటి ప్రత్యేక అవకాశాలు కల్పించడం ద్వారా అలాంటివారు ఆ అడ్డంకుల్ని అధిగమించి, ఇతర వర్గాలతో సమానంగా పోరాడడానికి వీలుంటుంది. అభివృద్ధి చెందిన వర్గాలవారికి నాణ్యమైన పాఠశాల విద్య, కోచింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. కుటుంబాల నేపథ్యం వారికి కలిసివస్తుంది. పోటీ పరీక్షలకు వారు అన్ని విధాలా బాగా సిద్ధం కాగలరు. ఇలాంటి అవకాశం లేని వర్గాలవారు వీరితో పోటీ పడలేక నష్టపోతారు. వారు చాలా అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య పొందడానికి కష్టపడి కృషి చేయవద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. ప్రతిభ అనేది కేవలం ఒకరి స్వయంకృషి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల వాతావరణమూ దానికి దోహదపడుతుంది. వ్యక్తి ప్రతిభకు మార్కులు ఒక్కటే అన్నివేళల్లో కొలమానం కాకపోవచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు ప్రాతిపదికను నిర్ణయించడానికి ఎంచుకున్న ప్రాతిపదిక చెల్లుబాటును మార్చిలో వివరంగా పరిశీలిస్తామని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?