Indian Independence:ఐక్యత వీడొద్దు.. పాక్ను కోరొద్దు
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో పడొద్దనీ... హిందూ-ముస్లింలు కొట్లాడుకోవద్దని... పాకిస్థాన్ ఏర్పాటు వద్దంటే వద్దనీ నినదించిందో కంఠం! అది రాజకీయ గొంతుక కాదు. ఓ ముస్లిం మతపెద్ద మాట. ఆయనే- మౌలానా హుసేన్ అహ్మద్ మదాని.
అన్ని విధాలుగా భారత్లో విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలు చేసిన ఆంగ్లేయులు తొలుత హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టారు. ఆ తర్వాత హిందువుల్లో కులాల మధ్య అంతరం సృష్టించారు. ముస్లింల్లోనూ సున్నీ-షియాల్లో విభేదాల అగ్గిరగిల్చారు. ఆంగ్లేయుల ఎత్తుగడలోని ఆంతర్యాన్ని ముందే గ్రహించిన ముస్లిం మేధావి మౌలానా హుసేన్్ మదాని... ఆది నుంచీ దీనిపై హెచ్చరిస్తూనే వచ్చారు.
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని బంగర్మావు అనే చిన్న పట్టణంలో 1879లో జన్మించిన మౌలానా మదాని తండ్రి సయ్యద్ హబీబుల్లా. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త వారసుల్లో 35వ తరానికి చెందిన కుటుంబం వీరిదంటారు. 13వ ఏట మదాని దారుల్ ఉలూమ్ దియోబంద్ (సున్నీ ఉద్యమంతో ముడిపడిన విద్యాలయం)లో చేరి మహమ్మద్ హసన్ వద్ద శిష్యరికం చేశారు. అక్కడ చదువు పూర్తయ్యాక సౌదీలోని పవిత్ర మదీనాకు వెళ్లి 28 సంవత్సరాలు అరబిక్ వ్యాకరణం బోధించి భారత్కు తిరిగి వచ్చారు. ఇంతలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతిస్తున్న కారణంగా తన గురువు మహమ్మద్ హసన్ను ఆంగ్లేయులు జైలులో బంధించారు. ఆయనకు మద్దతుగా తాను కూడా మూడేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా భారత జాతీయోద్యమంలో భాగమయ్యారు. ఆది నుంచీ... హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ... పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. పాకిస్థాన్ విషయంలో ఈ ముస్లిం మేధావికి, పాక్ మద్దతుదారు మహమ్మద్ ఇక్బాల్కు మధ్య ఆ కాలంలో పెద్ద వాగ్యుద్ధమే సాగింది.
‘భారత్లో ముస్లింలు హిందువులతో కలసి జీవనం సాగించటానికి చాలాకాలంగా అలవాటు పడ్డారు. ఇద్దరు మనుషుల మతాలు వేరైనా.. ఒకే చోట పుట్టినప్పుడు అనేక అంశాల్ని పంచుకుంటూ కలసిమెలసి జీవిస్తూనే ఉంటాం. బజార్లలో, వీధుల్లో, రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో, కాలేజీల్లో, కోర్టుల్లో, అసెంబ్లీలో, హోటళ్లలో... ఇలా ఒక్కటని కాదు. ప్రతిచోటా మనం ఒకరికొకరు ఎదురవని చోటేదైనా ఉంటుందా? ముస్లిం వ్యాపారి హిందువుకు వస్తువులు అమ్మడా? ముస్లిం లాయర్కు హిందూ క్లయింట్లు ఉండరా? ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని ఇతర మతస్థులకు ప్రాతినిధ్యం వహించరా? ఈ హిందూ-ముస్లిం విభజన అనేది ఆంగ్లేయుడు మనందరిపై తన పెత్తనం కోసం నాటిన విషపు విత్తనం. ఈ విభజించు పాలించు ఎత్తుగడలో పడి... వారి చేతిలో పావులమై... దేశాన్ని విభజిస్తే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి’ అంటూ లేఖ రాసి ముస్లింలను చైతన్య పరిచారు మౌలానా మదాని. ఆయన ప్రభావం కారణంగా... తూర్పు ఉత్తర్ప్రదేశ్, బిహార్ల్లోని ముస్లింలు చాలామంది విభజన సమయంలో పాకిస్థాన్కు వెళ్లకుండా భారత్నే తమ స్వదేశంగా ఎంచుకున్నారు. స్వాతంత్య్రా నంతరం భారత ప్రభుత్వం 1954లో మొదటి పద్మభూషణ్ అవార్డుతో మౌలానా మదానిని సత్కరించింది. భారత్లో హిందూ-ముస్లింల ఐక్యతకు తుదకంటా కోరుకున్న ఆయన 1957 డిసెంబరు 5న కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్