ఆహా ఏమి రుచి.. అనండి మైమరచి
తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి.
అమ్మానాన్నలు అలా తింటే పిల్లలూ అనుసరిస్తారు
ఆస్టన్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి. అప్పుడే పిల్లలూ పెద్దలను అనుసరిస్తారు. ఆరోగ్యకరమైన పదార్థాలను చిన్నారులకు అలవాటు చేయడంలో పెద్దలు ఈ తరహా ధోరణిని అవలంబించాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటీవల యూకేలోని ఆస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్’ మానసిక వైద్యనిపుణులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. రుచిని ఆస్వాదిస్తూ తింటున్న తల్లిదండ్రులను చూసి అనుసరించడానికి ఎక్కువమంది పిల్లలు మొగ్గుచూపినట్లుగా ఆ పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో చిన్నతనం నుంచి పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా అలవాటు చేయాలనే అంశంపై ప్రత్యేక కథనం.
అలా తినాలి.. ఆహా అనాలి!
ఈనాడు- హైదరాబాద్, అమరావతి
ఉరుకులు పరుగుల జీవితంలో తిండికి కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. సంతానం తల్లిదండ్రులతో కలిసి కూర్చుని తినడం చాలా వరకూ తగ్గిపోయింది. ఒకవేళ తింటున్నా టీవీ చూస్తూనో.. మొబైల్తోనో గడుపుతున్నారు. ఈ స్థితిలో తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవడం అనేది అరుదే. ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం లేదని వారిని మందలించడం కంటే.. ఆ దిశగా అసలు తాము ఏరకమైన ప్రయత్నాలు చేశామనే కోణంలో పెద్దలు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి మంచి ఆహారాలను అలవాటు చేస్తే.. అది వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
తొలి ఆర్నెల్లు కీలకం
ఆహారపు అలవాట్లలో పరిణామ క్రమాలుంటాయి. శిశువు పుట్టిన మొదటి ఆర్నెల్లలో తల్లి ఆహారపు అలవాట్లే తొలుత అత్యంత కీలకమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాలింత రుచులు పాల ద్వారా శిశువుకు చేరతాయి. తల్లి ఎన్ని ఎక్కువ రకాల ఆహారాలను తింటే.. శిశువుకు కూడా తల్లి పాల ద్వారా అన్ని రుచులు తెలుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఘన రూపంలో ఆయా పదార్థాలను ఇచ్చినప్పుడు వ్యతిరేకత లేకుండా వాటి రుచులను ఆస్వాదించడానికి అవకాశాలెక్కువ. ఇది ఒక రకంగా ఆహారపు అలవాట్లలో తొలి పరిణామ క్రమం.
ఆదర్శంగా నిలవాల్సింది పెద్దలే
పెద్దవారు కంచం ముందు కూర్చొని.. కొన్ని ఆహారాలను పక్కనబెట్టేసి.. ‘నాకు నచ్చట్లేదు..నేను తినను’ అని మాట్లాడుతుంటే పిల్లలూ అనుసరిస్తారు. అది తినకూడదేమో.. మంచిది కాదేమో.. బాగుండదేమో అని భావించే అవకాశాలున్నాయి. అందుకే తినేటప్పుడు తల్లిదండ్రులు ఆహారాల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ కుటుంబమంతా కలిసి తినడం మంచి అలవాటు.
టీవీ లోకంలో పడితే ఎక్కువ తినేసే ప్రమాదం
తింటున్న సమయంలో పిల్లల్ని ఎందుకూ పనికిరావని తిట్టడమూ, వారి చదువు గురించి మాట్లాడడమూ.. చేయకూడదు. ఒత్తిడి పెంచకూడదు. అలా చేస్తే ఎప్పుడెప్పుడు అక్కణ్నుంచి వెళ్లిపోదామా అనే ధోరణి వారిలో పెరుగుతుంది. అలా కాకుండా వారి అలవాట్లను శ్రద్ధగా పరిశీలించాలి. తద్వారా ఏం తింటున్నారు? ఏమి తినలేకపోతున్నారు? కారణాలేమిటో తెలుస్తుంది. సినిమా, టీవీ చూస్తూ ఆహార పదార్థాలను తినడాన్ని పూర్తిగా మానేయాలి. ఎందుకంటే అలా తింటున్నప్పుడు కడుపు నిండిందా? లేదా? అనేది గమనించకుండా ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. బరువు పెరుగుతారు. ఇవన్నీ పెద్దవారు చేయకుండా ఉంటే.. చిన్నపిల్లలూ పాటిస్తారు.
త్వరగా తినమని ఒత్తిడి చేయొద్దు
ఈ పని చేయకపోతే చాక్లెట్ కొనివ్వను.. ఈ హోంవర్కు పూర్తి చేస్తే స్వీట్ కొనిస్తాలాంటి ధోరణులు సరికాదు. ఆహారమనేది తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించడానికి, ప్రోత్సహించడానికి మధ్య సంబంధంగా ఉండకూడదు. అలా చేస్తే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినేద్దామనే ధోరణి పిల్లల్లో ప్రబలే ప్రమాదం ఉంటుంది. అలాగే నెమ్మదిగా తినడం నేర్పించాలి. బడికి సమయం దాటిపోతోంది. త్వరగా తినమని ఒత్తిడి చేయొద్దు. అలా త్వరత్వరగా తినడం వల్ల పిల్లలకు ఆ ఆహారపు రుచి కూడా తెలియదు. ఆస్వాదించే అవకాశమే ఉండదు. కొసరి కొసరి వడ్డించడమూ సరైన పద్ధతి కాదు. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేస్తే.. బయటకు వెళ్లినప్పుడు కూడా అటువంటివే తింటారు.
- డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, ఆశా ఆసుపత్రి, హైదరాబాద్
13 ఏళ్లలోపు వయసు ఎంతో కీలకం
చిన్న వయసు నుంచే మంచి ఆహార అలవాట్లు నేర్పిస్తే భవిష్యత్తులో పిల్లల్లో అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలుంటుంది. ముఖ్యంగా 13 ఏళ్లలోపు చిన్నారుల్లో మంచి ఆహార అవాట్లు తీసుకురాగలిగితే...భవిష్యత్తులో వారికి అనారోగ్య సమస్యలు చాలా వరకూ దూరంగా ఉంటాయి. మంచి పదార్థాలను తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడకపోతే తల్లిదండ్రులు వారి మనసు మార్చే ప్రయత్నాలు తొలి నుంచే చేయాలి. ఏది తింటే మంచి.. ఏది చెడు.. అనే అంశాలను సోదాహరణంగా వివరించాలి. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. పోషకాహారం వల్ల కలిగే లాభాలను చెప్పాలి. ఊబకాయం బారినపడకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలి. బరువు ఎక్కువగా పెరిగితే అమ్మాయిల్లో హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.
- డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్, సహ ఆచార్యులు, పిల్లల మానసిక వైద్య నిపుణులు, ఆంధ్రా వైద్య కళాశాల, వైజాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో