వైరస్ కొత్త రకాలపై ముందుగానే అంచనా
కొత్తరకం వైరస్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. అంతకుముందు డెల్టా రకం ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకాలను ముందుగానే గుర్తిస్తే కట్టడికి మరింత సమర్థ చర్యలు
ఐఎస్ఎన్వీ ట్రాకింగ్తో సాధ్యమే అంటున్న సీసీఎంబీ పరిశోధకులు
ఈనాడు, హైదరాబాద్: కొత్తరకం వైరస్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. అంతకుముందు డెల్టా రకం ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకాలను ముందుగానే గుర్తిస్తే కట్టడికి మరింత సమర్థ చర్యలు తీసుకునేందుకు.. వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు వీలవుతుంది. మరి వైరస్లోని కొత్త రకాలను ముందుగానే గుర్తించవచ్చా? అంటే అవుననే అంటున్నారు సీసీఎంబీ పరిశోధకులు. కొవిడ్ మొదటి, రెండో వేవ్ సమయంలో రోగుల నమూనాలపై వీరు నిర్వహించిన జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. ఇందులో వైరల్ జినోమ్లో విస్తరించిన సింగిల్ న్యూక్లియోటైడ్ వేరియేషన్స్ (ఎస్ఎన్వీ) ఆధారంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు మార్పులకు దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఏ మేరకు ఉత్పరివర్తనాలు ఉన్నాయనేది హోస్ట్ సింగిల్ న్యూక్లియోటైడ్ వేరియేషన్స్ (ఐఎస్ఎన్వీ) విశ్లేషణ ద్వారా తెలుసుకున్నారు. కొత్తగా కనిపించిన ఉత్పరివర్తనాల ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఎక్కువ వ్యాప్తికి కారణమయ్యే రకంగా మారే అవకాశాలున్నట్లు అంచనాకు వచ్చారు. రోగి శరీరంలో ఉన్నప్పుడే కొత్త ఉత్పరివర్తనాలతో వైరస్ ఎలా పరిణామం చెందుతుంది? కొత్త రకాలకు ఎలా దారి తీస్తుందనేది కనుగొన్నారు.
* జూన్ 2020కి ముందు మొదటి వేవ్ సమయంలో చైనా, జర్మనీ, మలేసియా, యూకె, యూఎస్, భారత్లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 1,347 నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. అప్పట్లో బాగా వ్యాప్తిలో ఉన్న బి.1, బి.6 రకాలకు చెందిన నమూనాల్లోని వైరస్ జీనోమ్లో 16,410 ఐఎస్ఎన్వీ విస్తరించి ఉన్నట్లు గమనించారు.
* రెండో దశలో నవంబరు 2020 నుంచి మే 2021 మధ్యలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన 1,774 నమూనాల జన్యుక్రమ విశ్లేషణలో డెల్టా, కప్పా రకాలు వ్యాప్తిలో ఉన్నట్లు ఐఎస్ఎన్వీ ద్వారా గుర్తించారు. జన్యు నిఘాలో భాగంగా ఐఎస్ఎన్వీలను ట్రాక్ చేయడం ద్వారా ఆందోళన స్థాయికి చేరే వైరస్ రకాలను ముందుగానే అంచనా వేయవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ), నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), జోధ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధనలో భాగస్వాములయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్