రుణమో రామచంద్రా
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీయగా.. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కొత్త రుణాల్లేకపోగా, పాత బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా బ్యాంకులు 30 శాతానికి పైగా రుణసాయాన్ని తగ్గించాయి. మంజూరైన వాటికీ మొండిచేయి చూపుతున్నాయి. రుణ లక్ష్యాలను సాధించడం లేదు. గతంలోలా రుణామేళాలూ లేవు....
పరిశ్రమలకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల అనాసక్తి
రెండేళ్లుగా 30 శాతం మేరకు తగ్గిన సాయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీయగా.. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కొత్త రుణాల్లేకపోగా, పాత బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా బ్యాంకులు 30 శాతానికి పైగా రుణసాయాన్ని తగ్గించాయి. మంజూరైన వాటికీ మొండిచేయి చూపుతున్నాయి. రుణ లక్ష్యాలను సాధించడం లేదు. గతంలోలా రుణామేళాలూ లేవు.
ఆపత్కాలంలో అందని ఆసరా
కరోనా సంక్షోభంతో చాలా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటిపై అపనమ్మకంతో బ్యాంకులు సాయం చేయడానికి వెనుకాడుతున్నాయి. గతంలో భూముల తనఖాపై అప్పులు ఇచ్చేవి. 2020 నుంచి భూములు చూపినా రుణాలివ్వడం లేదు. పారిశ్రామిక ఆస్తులనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇళ్లు, ఇతర విలువైన ఆస్తులను మాత్రమే పూచీకత్తుగా అంగీకరిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏటా 20 శాతం, సూక్ష్మ పరిశ్రమలకు 10 శాతం రుణాలు పెంచాల్సి ఉంది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో అవి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 39,351 కోట్లకు గాను, రూ. 21,426 కోట్లు మాత్రమే రుణాలిచ్చాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల వరకు రుణసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు ఫర్ మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ (సీజీటీఎంఎస్ఈ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద 2020-21లో 1449 మందికి మాత్రమే రూ. 185 కోట్ల సాయం మంజూరైంది. అదీ విడుదల కావాల్సి ఉంది.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమూహాల (క్లస్టర్ల)కు రుణ సాయం చేసేందుకు కేంద్రం నిర్దేశించింది. తెలంగాణలో 5,169 సమూహాలుండగా. అందులో 3,861 సమూహాల్లోని పరిశ్రమలకు మాత్రమే కొద్దిపాటి రుణసాయం అందింది.
* కరోనా కాలంలో రుణ వాయిదాలను చెల్లించని 1,57,034 పరిశ్రమలను బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దాదాపు రూ.7,184 కోట్ల మేర బకాయిలున్న వీటి జప్తునకు సన్నాహాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
* రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిన్నతరహా పారిశ్రామికవేత్త.. కరోనాతో పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారడంతో... రుణసాయం కోసం బ్యాంకులను సంప్రదించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే అప్పు ఇస్తామని బ్యాంకు తిరస్కరించింది.
* మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త బీటెక్ పూర్తి చేసి కొత్తగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమ స్థాపించాలని బ్యాంకు అధికారులను కలిశారు. రూ. 2 కోట్ల వరకు పూచీకత్తు లేకుండా సాయం అందించాల్సి ఉన్నా, రుణమివ్వడానికి బ్యాంకు ముందుకు రాలేదు.
* కేంద్రప్రభుత్వం తెచ్చిన అత్యవసర పరపతి పూచీ పథకం కింద 2,16,267 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా.. 87,516 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.
* కొవిడ్ కాలంలో దెబ్బతిన్న పరిశ్రమల ఖాతాల పునరుద్ధరణకు కేంద్రం ఆదేశించింది. దీని కింద 2,17,891 పరిశ్రమలను గుర్తించగా, 43,364 ఖాతాలను మాత్రమే బ్యాంకులు పునరుద్ధరించాయి.
* సంక్షోభంలో ఉన్న పరిశ్రమల కోసం సీజీఎస్ఎస్డీ పథకాన్ని కేంద్రం చేపట్టగా.. 562 పరిశ్రమలకు రూ.73 లక్షలు మాత్రమే రుణంగా అందింది.
* యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త జౌళి పరిశ్రమ నడుపుతున్నారు. పదేళ్ల కిందట బ్యాంకు రుణం తీసుకొని.. ఎనిమిదేళ్లు బకాయిలు చెల్లించారు. కరోనా వల్ల కిస్తీలు కట్టలేకపోయారు.బ్యాంకు ఆదుకోకపోగా, ఆయన పరిశ్రమను బ్యాంకు నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది.
బ్యాంకుల వైఖరి దారుణం
- కె. సుధీర్రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
కరోనా సమయంలో బ్యాంకుల వైఖరి దారుణంగా ఉంది. చిన్నపరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉన్నా, బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయి. ఏటా పదేసి శాతం రుణసాయం పెంచాల్సి ఉండగా.. ఉద్దేశపూర్వకంగా లక్ష్యాలను కుదించి, సాయం తగ్గిస్తున్నాయి. సీజీటీఎంఎస్ఈ వంటి పథకాలను పట్టించుకోవడం లేదు. రుణ వసూళ్లు వాయిదా వేయాలని, వడ్డీ తగ్గించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఏ సాయమూ అందలేదు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదరణ సున్నా
- శ్రీలక్ష్మివాణి; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు
మహిళలు ఉపాధి కోసం, ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్నా.. బ్యాంకులు వారిని ప్రోత్సహించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఎంపికైనా బ్యాంకులు తమ వాటాగా రుణాలివ్వడానికి మొరాయిస్తున్నాయి. గత రెండేళ్లలో వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కొంతమందికి మంజూరైనా విడుదల చేయడం లేదు. కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నది మహిళా పారిశ్రామికవేత్తలే. వారి ఖాతాలను వెంటనే నిరర్ధక ఆస్తులుగా మార్చడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి తప్ప ఆదుకోకపోవడం బాధాకరం. బ్యాంకుల ధోరణి మారితేనే పారిశ్రామికరంగం కుదుటపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్