సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైదరాబాద్ బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరిపై కేసులు
అందులో ప్రసారమయ్యే సమాచారాన్ని విశ్లేషించడానికి ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు
ప్రభుత్వాన్ని విమర్శించేవారిపైనా చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైదరాబాద్ బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరిపై కేసులు నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా మరో 43 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఏదో ఒకరోజు వీరందరిపైనా కేసులు నమోదవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో రకరకాల సామాజిక మాధ్యమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్ తదితరాలతో పాటు ఎవరికివారు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీటిలో ప్రసారమవుతున్న సమాచారాన్ని ఏమేరకు విశ్వసించవచ్చన్నది పక్కనపెడితే రకరకాల అంశాలపై ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. వీటిని అడ్డం పెట్టుకొని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా మతాలు, కులాల వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు వాడటం సామాజిక మాధ్యమాల్లో సాధారణమైంది. ఉదాహరణకు కరోనాకు సంబంధించి చికిత్స, ముందు జాగ్రత్తలు అంటూ ఎవరెవరో ప్రముఖుల పేర్లు చెప్పి కుప్పలు తెప్పలుగా సమాచారం ప్రసారమవుతోంది. ఇదే సమయంలో అనేక మంది సామాన్యులు కూడా తమ కళ్లెదుట జరుగుతున్న అక్రమాలను సామాజిక మాధ్యమాలు వేదికలుగా ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించేవారిని, అక్రమాలకు పాల్పడుతున్నవారిని నిలదీస్తున్నారు. అయితే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్లోని బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సామాజిక మాధ్యమం ద్వారా విమర్శలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదయింది. వీరిద్దర్నీ అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత వదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే నిర్మల్, హుజూరాబాద్, కరీంనగర్లకు చెందిన మరో ముగ్గురు సామాజిక మాధ్యమాల ప్రతినిధులపైనా కేసులు పెట్టి నోటీసులు పంపారు.
సుప్రీంకోర్టే చెప్పినా
వాస్తవానికి డిజిటల్ మాధ్యమం మాటున జరిగే నేరాలను అదుపు చేసే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీచట్టం తీసుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది ‘సెక్షన్ 66ఎ’. ఏదైనా డిజిటల్ మాధ్యమం ద్వారా వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, బెదిరించేలా సమాచారం ప్రసారం చేస్తే ఈ చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. దీనిపై పౌరహక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు 2015లో ఈ చట్టాన్ని తప్పుపట్టింది. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఈ చట్టం కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో పౌరహక్కుల సంఘం గతేడాది సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ‘సెక్షన్ 66ఎ’ రద్దు చేసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా 1307 కేసులు నమోదు చేశారని, వాటిలో 2021 మార్చివరకూ 745 కేసులు పెండింగ్లోనే ఉన్నాయని అందులో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ పోలీసులు.. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ కింద కాకుండా ఇతరత్రా చట్టాలు ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్ కేసులో ఐటీచట్టం ప్రస్తావన లేదు. ఐపీసీలోని 505(1)(బి), 504 వంటి సెక్షన్లు ఉపయోగించారు. అంటే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రశాంతతకు భంగం కలిగించేలా నేరానికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నమాట.
ఎక్కడికక్కడ విశ్లేషణ
సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న సమాచారంతో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశమున్న నేపథ్యంలో వీటిని ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలన్న ఉద్దేశంతో పోలీసుశాఖ ‘సోషల్ మీడియా మానిటరింగ్ సెల్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రసారాలను ఈ కేంద్రాలు పరిశీలిస్తుంటాయి. ఏదైనా విద్వేషపూరిత సమాచారం కనిపిస్తే దాన్ని నిరోధించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం వీటి ఉద్దేశం. కానీ ఈ కేంద్రాలు.. విమర్శలు చేసే వారిని, తప్పులను ఎత్తిచూపే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెక్షన్66ఎ ఐటీ చట్టం ఏం చెబుతోంది..
తప్పని తెలిసి కూడా ఎదుటి వ్యక్తిని బెదిరించేలా, అసౌకర్యానికి గురయ్యేలా, ప్రమాదానికి కారణమయ్యేలా, అవరోధాలు కల్పించేలా, కించపరిచేలా, శత్రుత్వం-ద్వేషం పెంచేలా, దురుద్దేశంతో కూడిన సమాచారాన్ని ఆన్లైన్లో చేరవేయడం నేరం అని..
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు