రాష్ట్ర సహకారం లేకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తమ వాటా నిధులు విడుదల చేయకపోవడం.... భూ కేటాయింపులు పూర్తి చేయకపోవడంవల్లే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా.. భూమి కేటాయింపులు పూర్తి చేయండి
సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తమ వాటా నిధులు విడుదల చేయకపోవడం.... భూ కేటాయింపులు పూర్తి చేయకపోవడంవల్లే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదని ఇటీవల తెరాస నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలకు ముందు ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయాన్ని, చేయాల్సిన భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ‘‘ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నిధుల కేటాయింపు కొన్ని రెట్లు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రూ.250 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2021-22 నాటికి రూ.2,420 కోట్లకు పెరిగాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ చూపి తక్షణమే సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొంటూ కిషన్రెడ్డి ఆయా ప్రాజెక్టుల్లోని సమస్యలను లేఖలో వివరించారు.
* మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలు మార్గం (151 కి.మీ.) నిర్మాణ వ్యయంలో ఇప్పటికీ రూ.100 కోట్ల బకాయి ఉంది. 342 హెక్టార్ల భూమిని రైల్వేకు అప్పగించాలి.
* అక్కన్నపేట-మెదక్ నూతన రైలు మార్గానికి 2021-22 ఏడాదికిగాను రాష్ట్రం రూ.31 కోట్లను చెల్లించడంతో పాటు 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాలి.
* ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేంద్ర ఇప్పటివరకు రూ.835 కోట్లు వ్యయం చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసింది. అంచనావ్యయం పెరిగిన మేరకు తన వాటాగా రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2ను యాదాద్రి వరకు (33 కి.మీ.) పొడిగించేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. రాష్ట్రం నిధులు జమ చేయనందున ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభంకాలేదు.
* భద్రాచలం రోడ్-సత్తుపల్లి నూతన మార్గం (53.2 కి.మీ.) పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021, జులై నాటికే దీనిని ప్రారంభించాలనుకున్నా ఎలక్టిక్ర్ హైటెన్షన్ క్రాసింగ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన భూ సమస్యలతో జాప్యం చోటుచేసుకుంది.
* కేంద్రమే పూర్తి నిధులిచ్చిన ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో చొరవ చూపకపోవడంతో ఆలస్యమవుతున్నాయి. ఉదా।। కాజీపేట-బలార్షా మూడో మార్గం, కాజీపేట-విజయవాడ మూడో మార్గం.
* కాజీపేట-హసన్పర్తి రోడ్ స్టేషన్ల మధ్య బైపాస్ లైన్, మూడో మార్గం పనులకు (11.06 కి.మీ.) 7.8 హెక్టార్ల భూమి అప్పగించాలని కోరి అందుకయ్యే వ్యయాన్ని జమ చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదు.
* మణుగూరు-రామగుండం, కొండపల్లి-కొత్తగూడెం మార్గాల నిర్మాణాల్లో వ్యయ భాగస్వామ్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రాజెక్టుల్లో వాటా నిర్ధారణకు తెలంగాణ ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు పంపినా ఏ స్పందనా లేదు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా-వికారాబాద్, కరీంనగర్-హసన్పర్తి, బోధన్-లాతూర్ రోడ్డు నూతన మార్గాల నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తయినా వ్యయ భాగస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించకపోవడంతో మంజూరు ఆగిపోయింది.
* చర్లపల్లి రైల్వేస్టేషన్ను కొత్త శాటిలైట్ టెర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే స్టేషన్ చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి వీలవుతుంది.
* రాష్ట్రానికి మొత్తం 54 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. అనేక అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి సహకారం అందడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా