మహమ్మారి ముగుస్తోందని భావించొద్దు
కరోనా మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని భావించడం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హెచ్చరించింది.
మరిన్ని వేరియంట్లు పుట్టుకురావొచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
జెనీవా: కరోనా మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని భావించడం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హెచ్చరించింది. మహమ్మారి తీవ్రదశ ఈ ఏడాది చివరివరకూ కొనసాగవచ్చని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధనోమ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి మనముందు కొన్ని సవాళ్లున్నాయి. యాంటీ-బయోటిక్స్ చికిత్సల సామర్థ్యం తగ్గుతుండటం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కరోనా విషయంలో ఒమిక్రానే చివరి వేరియంట్ అని, దీంతో మహమ్మారి అంతమవుతుందని భావించడం చాలా ప్రమాదకరం. ప్రతి దేశంలోనూ కొవిడ్ ముప్పు తీవ్రంగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యమిస్తూ, ఈ ఏడాది జూన్-జులై నాటికి 70% మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాలి. పరీక్షల సంఖ్యను పెంచాలి. కొత్త వేరియంట్లను సత్వరం గుర్తించి, నియంత్రించాలి. ఇవన్నీ చేయగలిగితే... డిసెంబరు నాటికి మహమ్మారి తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. భవిష్యత్తులోనూ కరోనాతో జీవించక తప్పదు. కొవిడ్ అన్నది నివారించదగ్గ వ్యాధి. చికిత్సలతోనూ దీన్ని సమర్థంగా ఎదుర్కోగలం. అలాంటి వ్యాధి కారణంగా వారానికి 50 వేలమంది చనిపోతూ ఉండటాన్ని ఏమాత్రం అంగీకరించలేం. కలిసికట్టుగా కృషిచేస్తే దీన్ని అడ్డుకోవడం సుసాధ్యమవుతుంది. మున్ముందు తలెత్తే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. శ్వాసకోశ వ్యాధుల నియంత్రణ వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలి’’ అని టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు.
కొత్తగా 3 లక్షల కేసులు
దిల్లీ, ఇండోర్: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా విజృంభిస్తోంది. కొత్తగా 3,06,064 మంది వైరస్ బారినపడగా, అనారోగ్యం తీవ్రమవడంతో మరో 439 మంది బాధితులు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 3,95,43,328కి, మరణాలు 4,89,848కి పెరిగాయి. ప్రస్తుతం 22,49,335 మంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.
హడలెత్తిస్తున్న సబ్ వేరియంట్లు!
కేసులు పెరుగుతున్న క్రమంలోనే ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ శ్రేణికి చెందిన బీఏ1, బీఏ2 వైరస్ల కారణంగా బ్రిటన్లో పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బీఏ2 స్టెయ్రిన్లో 53 సీక్వెన్స్లు ఉన్నాయని, ఇది శరవేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. సబ్-వేరియంట్ల కారణంగా గుజరాత్లో 24 గంటల వ్యవధిలోనే 41 కేసులు వెలుగుచూశాయి! మధ్యప్రదేశ్లోని ఇండోర్లోనూ జనవరి 6 నుంచి ఇప్పటివరకూ మొత్తం 21 మందికి ‘బీఏ2’ వేరియంట్ సోకినట్టు స్థానిక ప్రయోగశాల ‘మాలిక్యులర్ వైరాలజీ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ ల్యాబ్’ వెల్లడించింది. బాధితుల్లోని ఓ చిన్నారి సహా నలుగురు వయోజనుల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రేటు 15-40% ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వ్యాక్సిన్ రెండు డోసులు, ప్రికాషన్ డోసు తీసుకున్నవారికి కూడా సబ్-వేరియంట్లు సోకినట్టు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 15 నాటికి కేసులు తగ్గుముఖం
దిల్లీ: దేశంలో కొవిడ్ మూడోదశ కొనసాగుతోంది. కొద్ది రోజుల నుంచి రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. కిందటి రోజుతో పోల్చితే సోమవారం నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది. దిల్లీ, ముంబయి సహా పలు మెట్రో నగరాల్లోనూ, పలు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు