ఏకపక్షంగా అప్పగింత నోట్ ఎలా రూపొందిస్తారు
గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌసు కాంపోనెంట్లను గోదావరి బోర్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మేడిగడ్డ.. ఇతర కాంపోనెంట్లు బోర్డుకు ఇవ్వాల్సిన అవసరం లేదు
గోదావరి ఉప సంఘ సమావేశంలో తెలంగాణ అసంతృప్తి
ఈనాడు, హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌసు కాంపోనెంట్లను గోదావరి బోర్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం గోదావరి బోర్డు ఉప సంఘం వర్చువల్గా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో సమావేశాన్ని నిర్వహించింది. బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యా, సభ్యుడు కుటియాల్ సమావేశాన్ని నిర్వహించగా తెలంగాణ తరఫున శ్రీధర్రావు దేశ్పాండే, అంతరాష్ట్ర జల విభాగం ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ నుంచి గోదావరి డెల్టా సిస్టం సీఈ పుల్లారావు, ఏపీ జెన్కో సీఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌస్, ఏపీ నుంచి వెంకటనగరం పంపింగ్ స్కీంలను బోర్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన అప్పగింత నోట్ను (హ్యాండింగ్ ఓవర్ నోట్స్) సమావేశంలో చర్చకు పెట్టారు.
అభ్యంతరం తెలిపిన తెలంగాణ
కాంపొనెంట్ల అప్పగింతపై జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. 11.10.2021న నిర్వహించిన గోదావరి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టును జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రం అంగీకరించి సమాచారాన్ని బోర్డుకు అందజేసింది. ఇతర ప్రాజెక్టుల కాంపొనెంట్లను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే అవసరం ప్రస్తుతం లేదని చెప్పింది. గెజిట్ నోటిఫికేషన్లోని షెడ్యూల్-2లో పేర్కొన్న అయిదు ప్రాజెక్టులను తొలగించాలని, మరికొన్నింటి కాంపొనెంట్లను షెడ్యూల్-2 నుంచి షెడ్యూల్-3లోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తూ గతంలో గోదావరి బోర్డు, కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖలకు లేఖలు రాసినా ఇంత వరకు స్పందన లేదని, ఈ స్థితిలో బోర్డు పరిధిలోకి కాంపొనెంట్లను తీసుకొచ్చే అంశాన్ని ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరంలేదని సూచించింది. గోదావరి బోర్డు అనుమతి లేకుండానే జీఆర్ఎంబీ సెక్రటేరియట్ సభ్యులు ఏక పక్షంగా గోదావరి ప్రాజెక్టులను సందర్శించి అప్పగింత నోట్ (హ్యాండింగ్ ఓవర్ నోట్) తయారు చేయడం పట్ల తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత సమావేశంలో నోట్పై చర్చించలేమంది. గత కమిటీ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను అసంపూర్ణంగా రికార్డు చేశారని, ప్రస్తుత సమావేశం మినిట్స్లో తమ అభిప్రాయాలను సంపూర్ణంగా రికార్డు చేయాలని సభ్యులు కోరారు.
ఎక్కడికైనా తరలించుకునే అధికారం
అనంతరం ఏపీలోని వెంకటనగరం పంపింగ్ హౌస్పై జరిగిన చర్చలో ఏపీ సభ్యులు మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అన్ని కాంపొనెంట్లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టినవేనని, అవి తెలంగాణ ఆయకట్టుకు మాత్రమే నీటిని సరఫరా చేస్తాయని తెలిపారు. గోదావరి అవార్డు క్లాజ్-4 ప్రకారం రాష్ట్రాలకు గోదావరిలో తమ వాటా నీళ్లను ఎక్కడికైనా తరలించుకునే అధికారం ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ వాదన సమంజసం కాదని తెలంగాణ తరఫున పాల్గొన్న సభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్