ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
బయో సాంకేతికత, జీవశాస్త్రాలపై అతి పెద్ద అంతర్జాతీయ బయో ఆసియా-19 సదస్సును హైదరాబాద్ వేదికగా వచ్చే నెల 24, 25 తేదీల్లో దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.
24, 25 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహణ
70 దేశాల నుంచి 30 వేల మంది పాల్గొనే అవకాశం
తెలంగాణ జైత్రయాత్రలో ఈ సదస్సుది అమూల్యపాత్ర
మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: బయో సాంకేతికత, జీవశాస్త్రాలపై అతి పెద్ద అంతర్జాతీయ బయో ఆసియా-19 సదస్సును హైదరాబాద్ వేదికగా వచ్చే నెల 24, 25 తేదీల్లో దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అంకుర వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఏడాది సదస్సుకు ‘భవిష్యత్తుకు సిద్ధం (ఫ్యూచర్ రెడీ)’అనే నినాదాన్ని సోమవారం ఎంపిక చేశారు. సదస్సు తేదీలను ప్రకటించారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వహణలో దిగ్గజ సంస్థలు
సదస్సు నిర్వహణలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, నోవార్టిస్, అరబిందో ఫార్మా.. హెటిరో, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు జీవశాస్త్రాల పరిశ్రమలోని భారత్ బయోటెక్, జీవీకే, ఫెర్రింగ్, సైటివా వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి బలరామ్ భార్గవ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోబెల్ బహుమతి విజేతలు డాక్టర్ కర్ట్ వుత్రిచ్, అడా యోనాథ్, హెరాల్డ్ జుర్ హౌసెన్, బారీ మార్షల్, మార్టిన్ జె ఎవాన్స్, లాస్కర్ అవార్డు గ్రహీతలు, డాక్టర్ వాస్ నరసింహన్ వంటి ప్రముఖులు చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు.
నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది
ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ‘‘ఔషధ, జీవశాస్త్రాల రంగాలకు ప్రపంచస్థాయి కేంద్రం (హబ్)గా, టీకాల రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వైద్యఆరోగ్య సంరక్షణలో భారతదేశంతో పాటు ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు అమూల్యపాత్ర పోషిస్తోంది. గత 18 ఏళ్లలో బయో ఆసియా సదస్సు ద్వారా రూ. 19,400 కోట్ల విలువైన 270 పైగా ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఈ సదస్సులో ప్రసిద్ధ నిపుణులు తమ పరిశోధనలను ఆవిష్కరించనున్నారు. కరోనా అనుభవాల నేపథ్యంలో ఇది కొత్త పరిష్కారాలను చూపుతుంది. నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది అవుతుంది. జీవశాస్త్రాల రంగ ప్రస్తుత గమనం, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై చర్చాగోష్ఠులు జరగనున్నాయి. కరోనా విసిరిన సవాళ్లు..ఆరోగ్య పరిరక్షణలో సాంకేతిక అవకాశాలు, టీకాలలో భారత్ పాత్ర వంటి అంశాలపై చర్చిస్తాం. సదస్సుకు అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు