మానవత్వం చాటుతున్న.. గాంధీ
కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్ బాధితులకు
కొవిడ్ రోగులకు అత్యవసర ఆపరేషన్లు
వైద్యం అందించిన 5 రోజుల తరువాత శస్త్రచికిత్సలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్ బాధితులకు అత్యవసర ఆపరేషన్లు చేస్తూ మానవత్వాన్ని చాటుతోంది. కొవిడ్ సోకిన అయిదు రోజుల తరవాత రోగికి అవసరమైన ఆపరేషన్లు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తోంది. గడిచిన పదిహేను రోజుల్లో వంద మందికి ఇలాంటి అత్యవసర ఆపరేషన్లు చేశారు.
మొదటి, రెండు దశల్లో కరోనా బారినపడిన దాదాపు రెండు లక్షల మందికి గాంధీ ఆసుపత్రి చికిత్సలు అందించింది. ప్రస్తుత కరోనా మూడో దశలోనూ రోగులకు సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి గాంధీని మొత్తం కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించకుండా 300 పడకలను మాత్రమే కేటాయించి చికిత్సలు అందిస్తున్నారు. మెదడు, ఇతర ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు. ఇలాంటి వారిని చేర్చుకోవడానికి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విముఖత చూపుతున్నాయి. అత్యవసరమైనా సరే.. ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి వారికి అండగా నిలుస్తోంది గాంధీ ఆసుపత్రి. సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కొన్ని రోజుల కిందట వైద్యులతో చర్చించి అత్యవసరమైన వారికి ఆపరేషన్లు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాంటి రోగుల కోసం ప్రతి విభాగంలో 10 నుంచి 30 పడకలు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స అవసరమై, కొవిడ్ బారినపడిన రోగులు ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 70 మంది ఉన్నారు. వారిలో 20 మంది అయిదేళ్లలోపు చిన్నారులు, 40 మంది గర్భిణులు. వీరందరికీ శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ శాతం తగ్గిపోయి, ఆరోగ్యం విషమిస్తున్న వారికి మాత్రం వైరస్ లక్షణాలు తగ్గిన తరువాతే ఆపరేషన్లు చేయాలని వైద్యులు భావిస్తున్నారు.
వంద మందికి అత్యవసర ఆపరేషన్లు
మహమ్మారి సోకిన వారికి అత్యవసర చికిత్సలు అందించేందుకు గాంధీలో వైద్య బృందాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పదిహేను రోజుల్లో వంద మంది కరోనా బాధితులకు చిన్న, పెద్ద ఆపరేషన్లు చేశాం. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం కొవిడ్ బాధితులకు 5 లేదా 7 రోజుల చికిత్స సరిపోతుంది. తరవాత మళ్లీ వైరస్ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో 180 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
- డాక్టర్ రాజారావు, సూపరిండెంటెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?