మరో రెండు క్యాథ్ల్యాబ్లు
గుండెజబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ల్యాబ్ సౌకర్యం త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్ బోధనాసుపత్రుల్లో రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గాంధీలో ఈ సౌకర్యం కల్పించినా ఉపయోగించక పాడవడంతో మరో 2 నెలల్లో కొత్తగా నెలకొల్పడానికి
త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్లలో ఒక్కోటి రూ.7 కోట్లతో అందుబాటులోకి
నేడు ఖమ్మంలో ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
గుండె వైద్యంలో మెరుగైన సేవలు
ఈనాడు - హైదరాబాద్: గుండెజబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ల్యాబ్ సౌకర్యం త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్ బోధనాసుపత్రుల్లో రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గాంధీలో ఈ సౌకర్యం కల్పించినా ఉపయోగించక పాడవడంతో మరో 2 నెలల్లో కొత్తగా నెలకొల్పడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మూడింటితో పాటు ఖమ్మంలో అత్యాధునిక క్యాథ్ల్యాబ్ను శుక్రవారం వైద్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్ల్యాబ్ ఇదే. వీటికి అదనంగా వచ్చే ఏడాదికి సిద్దిపేటలో, 2024లో మహబూబ్నగర్ బోధనాసుపత్రిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్ల వ్యయం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్యఆరోగ్యశాఖ సర్కారుకు నివేదించింది. క్యాథ్ల్యాబ్లో గుండెజబ్బులకు పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి.
రోగులకు మేలు
* ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో నెలకొల్పిన అధునాతన క్యాథ్ల్యాబ్ విశేష సేవలందిస్తోంది. ఇప్పుడు జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా గుండె చికిత్సల వికేంద్రీకరణ జరుగుతుంది.
* గుండె రక్తనాళాల్లో పూడికలుంటే క్యాథ్ల్యాబ్లో గుర్తించవచ్చు. స్థానికంగానే సరిచేయవచ్చు. అప్పుడు హైదరాబాద్కు రావాల్సిన శ్రమ తప్పుతుంది.
* ఖమ్మం క్యాథ్ల్యాబ్ పరిధిలో మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, మహబూబాబాద్ తదితర 12 అనుబంధ చికిత్స కేంద్రాలను చేర్చారు.
* వీటిల్లో టెలీ ఈసీజీ యంత్రాలను పెట్టారు.
* గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తికి ఈ కేంద్రాల్లో వైద్యుడు ముందుగా ఈసీజీ తీస్తారు. వెంటనే ఆ ఫలితం కాపీ ఆన్లైన్లో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని క్యాథ్ల్యాబ్లో సేవలందిస్తున్న గుండె వైద్యనిపుణుడికి చేరుతుంది.
* ఆ ఫలితాన్ని వైద్యుడు ఆన్లైన్లో పరీక్షించి.. ఒకవేళ అందులో తేడాలున్నట్లుగా గుర్తిస్తే.. వెంటనే రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంజక్షన్(థ్రాంబోలైసిస్) ఇవ్వమని సూచిస్తారు.
* థ్రాంబోలైసిస్ ఇచ్చిన అనంతరం రోగి ఆరోగ్యం కుదుటపడగానే.. అక్కడ్నించి ఖమ్మం తరలించి, రక్తనాళాల్లో పూడికలున్నాయా అని తెలుసుకునే పరీక్ష(యాంజియోగ్రామ్) చేస్తారు. అవసరమైతే స్టెంటు చికిత్స(యాంజియోప్లాస్టీ) కూడా చేస్తారు.
* అచ్చంగా ఇదే తరహా విధానాన్ని సిద్దిపేట, మహబూబ్నగర్లలోనూ అమలు చేయనున్నారు.
బహుళ ప్రయోజనాలు
* ఈ క్యాథ్ల్యాబ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి. ఇందులో ‘3 డి ఇమేజ్’ వెసులుబాటు ఉంటుంది.
* ‘ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వు’ విధానం కూడా ఉంటుంది. అంటే గుండె రక్తనాళాల్లో ఒక్కోసారి 50-60 శాతం పూడికలు ఏర్పడితే దీనికి స్టెంట్ వేయలా వద్ద అనేదాన్ని గుర్తించడానికి ‘ప్రెజర్ వైర్’ను వాటి వద్ద పెడతారు. తద్వారా పూడిక వద్ద రక్త ప్రసరణ ఒత్తిడిని గుర్తిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని స్టెంట్ వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.
* గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్మేకర్ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం(పెరికార్డియల్ ఎఫ్యూజన్) వంటి వాటికి చికిత్సలు కూడా ఇందులోనే చేస్తుంటారు.
* గుండె రక్తనాళాల్లోనే కాదు.. చేతుల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా స్టెంట్లను వేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్లోమగ్రంధిలోనూ స్టెంట్లు వేయాల్సి ఉంటుంది. వీటిని కూడా క్యాథ్ల్యాబ్లోనే చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం