కళ తప్పిన పసుపు!
రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
పడిపోతున్న ధర
రైతుకు నష్టాల భారం
అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం క్వింటా కొత్త పసుపు ధర రూ.300 దాకా తగ్గి రూ.8411కి చేరింది. కనిష్ఠ ధర క్వింటాకు రూ.4501 మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది రైతులకు సగటు ధర రూ.5333 చొప్పున వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న కొత్త పసుపు పంటలో తేమ అధికంగా ఉంటోందని వ్యాపారులు ధర బాగా తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలో పసుపు సాగవుతున్న కొన్ని జిల్లాల్లో సాధారణంకన్నా 30 నుంచి 50 శాతం అదనంగా కురిసిన వర్షాలతో నేలలో తేమ పెరిగి దుంపకుళ్లు తెగులు వ్యాపించింది. ఈ కారణంగా పంట దిగుబడి 20 శాతానికి పైగా తగ్గవచ్చని ‘భారత పసుపు వ్యాపారుల సంఘం’(ఐటీఏ) అంచనా వేసింది. సాధారణంగా తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో ధరలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడే తక్కువగా ఉంది. క్వింటా ధర రూ.9 వేలకుపైగా ఉంటేనే రైతుకు గిట్టుబాటవుతుందని రాష్ట్ర ఉద్యానశాఖ అంచనా. ‘‘సాధారణంగా పసుపు సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ధరలు పుంజుకోకపోతే పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యానశాఖ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. ‘‘ఈ పంటకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటోంది. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్రకన్నా ఎప్పుడూ క్వింటాకు రూ.వెయ్యి నుంచి 3 వేల దాకా తక్కువ చెల్లిస్తున్నారు. అందుకే ఏటా పంట విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది’’ అని రైతులు వాపోతున్నారు.
వేచిచూస్తే ధరలు పెరగొచ్చు
‘‘వర్షాలతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పంట దిగుబడులు తగ్గాయి. 2020లో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు 97 లక్షల బస్తాల పసుపు వచ్చింది. ఒక్కో బస్తా 50 కిలోలుంటుంది. ఈ ఏడాది 94.20 లక్షల బస్తాలకు మించి రాకపోవచ్చని భారత పసుపు వ్యాపారుల సంఘం అంచనా. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా 25.90 లక్షల బస్తాలుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్లీ పసుపు వినియోగం పెరిగి ఎగుమతులు పుంజుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర రైతులు కొత్త పసుపు పంటను ఈ నెలాఖరు నుంచి మార్కెట్లకు తేవడం ఆరంభిస్తారు. వారు వేచిచూస్తే కొంతకాలానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయి’’ అని ఐటీఏ ప్రతినిధులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్