Medaram Jatara: మేడారం జాతర... మహా సవాల్
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు సుమారు కోటిమంది తరలివస్తారని అంచనా. ఇప్పటికే వేలాదిగా భక్తుల రాక మొదలైంది.
జాతరకు కోటిమంది రావొచ్చని అంచనా
ఇప్పటికే ప్రారంభమైన భక్తుల రాక
కొవిడ్ నేపథ్యంలో నిబంధనల అమలుపై మరింత దృష్టి అవసరం
ఈనాడు, వరంగల్: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు సుమారు కోటిమంది తరలివస్తారని అంచనా. ఇప్పటికే వేలాదిగా భక్తుల రాక మొదలైంది. కొవిడ్ మూడోదశ ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అవసరమైన ఏర్పాట్లు చేయడం, నిబంధనలు పాటించేలా చూడటం ముఖ్యం. జాతరకు వచ్చేవారంతా కచ్చితంగా మాస్కు ధరించేలా చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లక్షల్లో మాస్కులను ఉచితంగా పంపిణీ చేయడం, ధరించని వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాల్సి ఉంటుంది. లక్షణాలున్న వారిని గుర్తించేందుకు థర్మల్ స్క్రీనర్లు వేల సంఖ్యలో అవసరం అవుతాయి. కొవిడ్ తీవ్రత పెరిగి ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సి వస్తే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలుండాలి. ములుగు జిల్లాల్లో పెద్ద ఆసుపత్రులు ములుగు, ఏటూరునాగారంలో ఉన్నాయి. మేడారం నుంచి ములుగు 47 కిలోమీటర్లు, ఏటూరునాగారం 35 కి.మీ.ల దూరంలో ఉంది. చికిత్స అవసరమైతే రద్దీలో అంత దూరం తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి మేడారంలోనే కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. జాతరకు అనేక ప్రాంతాల నుంచి గర్భవతులు వస్తారు. వారి కోసం లేబర్ రూం అవసరం. ఈ అంశాలపై అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.
సిబ్బంది సరిపోయేనా?
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జాతరలో సుమారు 1100 మంది వరకు ఉన్నారు. వీరిలో 150 వరకు వైద్యులు ఉంటారు. గత సంవత్సరం దాదాపు ఇంతే సంఖ్యలో వెద్య సిబ్బంది పనిచేశారు. ఈసారి కొవిడ్ నేపథ్యంలో వీరి సంఖ్య పెంచడంపై దృష్టిసారించాలి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నవారిలో ఇప్పటికే 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సంస్థల సేవలు కూడా వినియోగించుకోవాలి. భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్నందున గద్దెల ప్రాంతంతోపాటు జంపన్నవాగు, గిరిజన మ్యూజియం తదితర ప్రాంతాల్లో శానిటైజేషన్ నిరంతరం కొనసాగాలి. జాతరకు రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు మాత్రమే రావాలనే ప్రతిపాదన పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొవిడ్ నేపథ్యంలో మాస్కులను విరివిగా పంపిణీ చేస్తామని, నిబంధనల అమలుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు.
నేడు మేడారానికి... ముగ్గురు మంత్రులు, సీఎస్, డీజీపీ
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పరిశీలనకు శనివారం ముగ్గురు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మేడారం రానున్నారు. వీరితో పాటు సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సైతం ఏర్పాట్లు పరిశీలించనున్నారు. స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్