Indian Independence:ఐక్యత వీడొద్దు.. పాక్ను కోరొద్దు
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో పడొద్దనీ... హిందూ-ముస్లింలు కొట్లాడుకోవద్దని... పాకిస్థాన్ ఏర్పాటు వద్దంటే వద్దనీ నినదించిందో కంఠం! అది రాజకీయ గొంతుక కాదు. ఓ ముస్లిం మతపెద్ద మాట. ఆయనే- మౌలానా హుసేన్ అహ్మద్ మదాని.
అన్ని విధాలుగా భారత్లో విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలు చేసిన ఆంగ్లేయులు తొలుత హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టారు. ఆ తర్వాత హిందువుల్లో కులాల మధ్య అంతరం సృష్టించారు. ముస్లింల్లోనూ సున్నీ-షియాల్లో విభేదాల అగ్గిరగిల్చారు. ఆంగ్లేయుల ఎత్తుగడలోని ఆంతర్యాన్ని ముందే గ్రహించిన ముస్లిం మేధావి మౌలానా హుసేన్్ మదాని... ఆది నుంచీ దీనిపై హెచ్చరిస్తూనే వచ్చారు.
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని బంగర్మావు అనే చిన్న పట్టణంలో 1879లో జన్మించిన మౌలానా మదాని తండ్రి సయ్యద్ హబీబుల్లా. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త వారసుల్లో 35వ తరానికి చెందిన కుటుంబం వీరిదంటారు. 13వ ఏట మదాని దారుల్ ఉలూమ్ దియోబంద్ (సున్నీ ఉద్యమంతో ముడిపడిన విద్యాలయం)లో చేరి మహమ్మద్ హసన్ వద్ద శిష్యరికం చేశారు. అక్కడ చదువు పూర్తయ్యాక సౌదీలోని పవిత్ర మదీనాకు వెళ్లి 28 సంవత్సరాలు అరబిక్ వ్యాకరణం బోధించి భారత్కు తిరిగి వచ్చారు. ఇంతలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతిస్తున్న కారణంగా తన గురువు మహమ్మద్ హసన్ను ఆంగ్లేయులు జైలులో బంధించారు. ఆయనకు మద్దతుగా తాను కూడా మూడేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా భారత జాతీయోద్యమంలో భాగమయ్యారు. ఆది నుంచీ... హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ... పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. పాకిస్థాన్ విషయంలో ఈ ముస్లిం మేధావికి, పాక్ మద్దతుదారు మహమ్మద్ ఇక్బాల్కు మధ్య ఆ కాలంలో పెద్ద వాగ్యుద్ధమే సాగింది.
‘భారత్లో ముస్లింలు హిందువులతో కలసి జీవనం సాగించటానికి చాలాకాలంగా అలవాటు పడ్డారు. ఇద్దరు మనుషుల మతాలు వేరైనా.. ఒకే చోట పుట్టినప్పుడు అనేక అంశాల్ని పంచుకుంటూ కలసిమెలసి జీవిస్తూనే ఉంటాం. బజార్లలో, వీధుల్లో, రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో, కాలేజీల్లో, కోర్టుల్లో, అసెంబ్లీలో, హోటళ్లలో... ఇలా ఒక్కటని కాదు. ప్రతిచోటా మనం ఒకరికొకరు ఎదురవని చోటేదైనా ఉంటుందా? ముస్లిం వ్యాపారి హిందువుకు వస్తువులు అమ్మడా? ముస్లిం లాయర్కు హిందూ క్లయింట్లు ఉండరా? ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని ఇతర మతస్థులకు ప్రాతినిధ్యం వహించరా? ఈ హిందూ-ముస్లిం విభజన అనేది ఆంగ్లేయుడు మనందరిపై తన పెత్తనం కోసం నాటిన విషపు విత్తనం. ఈ విభజించు పాలించు ఎత్తుగడలో పడి... వారి చేతిలో పావులమై... దేశాన్ని విభజిస్తే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి’ అంటూ లేఖ రాసి ముస్లింలను చైతన్య పరిచారు మౌలానా మదాని. ఆయన ప్రభావం కారణంగా... తూర్పు ఉత్తర్ప్రదేశ్, బిహార్ల్లోని ముస్లింలు చాలామంది విభజన సమయంలో పాకిస్థాన్కు వెళ్లకుండా భారత్నే తమ స్వదేశంగా ఎంచుకున్నారు. స్వాతంత్య్రా నంతరం భారత ప్రభుత్వం 1954లో మొదటి పద్మభూషణ్ అవార్డుతో మౌలానా మదానిని సత్కరించింది. భారత్లో హిందూ-ముస్లింల ఐక్యతకు తుదకంటా కోరుకున్న ఆయన 1957 డిసెంబరు 5న కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ