Omicron: తగ్గుతోంది కానీ..
ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం
దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం..
ఒమిక్రాన్లో వేధిస్తున్న ప్రధాన సమస్యలివి
జ్వరం, జలుబు, గొంతునొప్పి తగ్గుముఖం
ఆసుపత్రిలో చేరికలు అతి స్వల్పం
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతుండటంతో.. ఆసుపత్రుల్లో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉంటున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా..దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా..స్వల్ప దగ్గు కూడా 6-7 రోజులకూ తగ్గకపోయినా.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్.. స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలున్నాయనీ..దీన్ని తొలిదశలో గుర్తించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశముంటుందని వైద్యులు వివరిస్తున్నారు.
రెండోదశ కంటే భిన్నంగా..
కొవిడ్ రెండోదశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు..అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు.శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్కు గురైనవారు కూడా ఒక శాతం కంటే తక్కువ మందే ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరేవారు కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు.
ఒమిక్రాన్లో కనిపిస్తున్న లక్షణాలివి..
అత్యధికుల్లో తొలుత గొంతులో ఇబ్బంది, దురదతో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో తలనొప్పితోనూ వ్యాధి మొదలవుతోంది. పారాసెటమాల్ ఇచ్చినా తగ్గడం లేదు. తలనొప్పి కొందరికి ఒకవైపే వచ్చి తీవ్రంగా వేధిస్తుంది. ఆ తర్వాత గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా ఉంటోంది. కొందరు చలి జ్వరంతోనూ ఇబ్బంది పడుతున్నారు. డెంగీలో వచ్చినట్లుగా ఒళ్లునొప్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి చెమట పడుతోంది. పిల్లల్లో కొందరికి వాంతులు వస్తున్నాయి. కళ్లు కూడా ఎర్రబడుతున్నాయి. కొందరిలో వ్యాధి తగ్గినా కూడా.. 2-3 వారాలైనా దగ్గు తగ్గడం లేదు. దీనికి వేర్వేరు కారణాలుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కూడా దగ్గు రావచ్చు. రాత్రివేళ పడుకున్నప్పుడు సైనస్ల నుంచి తెమడ ముక్కులోకి.. అక్కడి నుంచి గొంతులోకి జారుతుంది. దీన్ని బయటకు పంపించే ప్రక్రియలో భాగంగా దగ్గు వస్తుంది.అందుకే రాత్రి పూట ఎక్కువవుతుంది. పారాసెటమాల్ వేసుకున్నా తగ్గకపోతే.. ఇతర మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.
సీటీ స్కాన్లు చేయించడం లేదు
ఇప్పుడొస్తున్న ఇన్ఫెక్షన్లలో 95 శాతానికి పైగా ఒమిక్రానే. వైరస్ గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసకోశాల్లోకి వెళ్లడం లేదు. గతంలో డీ డైమర్ విపరీతంగా పెరిగి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు డీ డైమర్ కూడా పెరగడం లేదు. ఎక్స్రే, సీటీ స్కాన్లు కూడా చేయడంలేదు. నిమోనియా వైపు ఎక్కువ కేసులు వెళ్లడం లేదు. చాలా కొద్దిమందిలో..అదీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది. నిమ్స్లో అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్లలేదు. దీనివల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. చాలామంది పారాసెటమాల్తోనే కోలుకుంటున్నారు. దగ్గు మూణ్నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దగ్గు మందు ద్రావణాన్ని సూచిస్తున్నాం.గొంతునొప్పి మూణ్నాలుగు రోజులైనా తగ్గకపోతే..అజిత్రోమైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఇస్తున్నాం.
- డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ విభాగాధిపతి, నిమ్స్
లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రికి
డెల్టాలో సాధారణంగా పొడి దగ్గు వచ్చేది. ఒమిక్రాన్లో తెమడతో కూడా దగ్గు వస్తోంది. లక్షణాలు తక్కువగా ఉండి ఎక్కువ రోజులున్నా కూడా సీఆర్పీ వంటి కొన్ని పరీక్షలు చేయిస్తున్నాం.ఎందుకంటే అంతర్లీనంగా ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాల్సిన అవసరముంది. నిమోనియా దశకు వెళ్లినప్పుడు ఆయాసం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, మానసికంగా అయోమయ స్థితి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంట్లో చికిత్స పొందుతున్న క్రమంలో.. మగతగా ఉండడం..రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువకు పడిపోతుండడం.. నాడి కొట్టుకోవడం 100 దాటుతున్నా..నిస్సత్తువ ఆవహించినా..డీడైమర్, సీఆర్పీ వంటి పరీక్షల్లో ఫలితాలు ఉండాల్సిన దాని కంటే 2-3 రెట్లు అధికంగా ఉన్నా..వెంటనే ఆసుపత్రిలో చేరాలని గుర్తుంచుకోవాలి.
- డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఏఐజీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM