PM Modi: మీరు మారకపోతే.. నేనే మార్చేస్తా
పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు...
పార్లమెంటుకు హాజరుపై భాజపా ఎంపీలకు ప్రధాని హెచ్చరిక
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా
దిల్లీ: పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదేపదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటుచేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని మోదీ సూచించినట్టు ఆయన తెలిపారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో తరచూ సమావేశం కావాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. వారితో కలిసి తేనీరు తాగాలన్నారు. ప్రధాని మోదీ కూడా తన నియోజకవర్గమైన వారణాసిలో ఈనెల 14న పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో భేటీ అవుతారని తెలిపారు. సంప్రదాయానికి భిన్నంగా భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం తొలిసారి పార్లమెంటు వెలుపల జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మరమ్మతులు జరుగుతుండటంతో సమావేశ వేదికను మార్చారు. హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో నేతలు మోదీకి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. నవంబరు 15ను బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని మోదీ చేసిన ప్రకటనపై కేంద్రమంత్రి అర్జున్ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధానిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
13న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రారంభించనున్నట్టు భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మంగళవారం తెలిపారు. ‘దివ్య కాశీ, భవ్య కాశీ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి భాజపా సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘పవిత్ర నగర రూపురేఖలను మార్చేందుకు సంకల్పించడం ద్వారా భారత సాంస్కృతిక హీరోగా మోదీ నిలిచారు. 250 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాల్లో సుందరీకరణ, పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఈ సందర్భంగా వారణాసిలో నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 13-14 తేదీల్లో భాజపా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో, 17న దేశంలోని అందరు మేయర్లతో సమావేశాలు ఉంటాయి’’ అని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.
16న వారణాసిలో యూపీ మంత్రివర్గ సమావేశం
ఈనాడు, లఖ్నవూ: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నేపథ్యంలో వారణాసిలో ఈ నెల 16న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా కాశీ గొప్పతనాన్ని, హిందూత్వ సందేశాన్ని చాటిచెప్పేందుకు భాజపా సర్కారు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని కలల ప్రాజెక్టు...
2014 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన తరువాత ప్రధాని మోదీ తన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఆయన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. వారణాసిలో మోదీ పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆలయంలో పూజలు చేయడమే కాకుండా, కారిడార్ నిర్మాణం విషయమై ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ అన్నారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
30శాతానికి పడిపోయిన విశాఖ ఉక్కు ఉత్పత్తి
విశాఖలోని ‘అదానీ గంగవరం పోర్టు’లో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై తీవ్రంగా పడుతోంది. -
బెంబేలెత్తిస్తున్న భానుడు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్లోనే భానుడు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. శుక్రవారం 61మండలాల్లో తీవ్ర వడగాలులు, 117మండలాల్లో వడగాలులు వీచాయి. -
ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పులకు సిద్ధం
అప్పు తీసుకుంటే తప్ప అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. కొత్త అప్పులకు ఆమోదం సాధించింది. -
సినర్జీస్ ఛైర్మన్ మొవ్వా శేఖర్ మృతి
పారిశ్రామికవేత్త, దువ్వాడ వీసెజ్లో ఉన్న సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ మొవ్వా శేఖర్ (59) తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు పరిశ్రమ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు
డిపాజిట్ల స్వీకరణకు సంబంధించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందున్న కేసును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబరు 31న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. -
నాడు దళితుడు.. నేడు బీసీ బిడ్డలు
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో వడ్డెర వర్గానికి చెందిన బిడ్డల్ని బలి చేయాలని చూస్తున్నారని ఆ సామాజిక వర్గ సంఘం నేతలు ధ్వజమెత్తారు. -
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మే మొదటి వారంలో ఒకరోజు సాధారణ సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. -
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!