Subhash Chandra Bose: బ్రిటిష్ను బోల్తా కొట్టించిన బోస్
కాంగ్రెస్లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా..
కాంగ్రెస్లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా దేశం సరిహద్దులు దాటేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాత దాదాపు ఒంటరైనా.. తన పోరాటాన్ని ఆపలేదు నేతాజీ. విదేశీ సాయం లేనిదే బ్రిటిష్వారిని పారదోలలేమని నమ్మిన ఆయన- రష్యా, జర్మనీ, జపాన్ల సహకారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. సరైన సమయం కోసం వేచిచూస్తున్నారంతే! మరోవైపు నేతాజీ విప్లవ పంథా గురించి తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని ఎదురుచూస్తోంది. కోల్కతాలో నిరసన ప్రదర్శనను సాకుగా చూపుతూ... 1940 జులై 2న ఆయన్ను అరెస్టు చేసి జైల్లో వేశారు. రాజద్రోహ నేరం కూడా మోపారు. విచారణ మొదలవటానికి ముందే.. వ్యూహాత్మకంగా బోస్ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష వారం రోజులు దాటి... ఆయన ఆరోగ్యం పాడవుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. బోస్కేమైనా అయితే బెంగాల్తో పాటు యావద్దేశం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలిసిన ఆంగ్లేయులు డిసెంబరులో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. కోల్కతాలోని తన ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచారు.
ఆ మాత్రం అవకాశం చాలనుకున్న నేతాజీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. తొలుత అఫ్గానిస్థాన్కు, తర్వాత సోవియట్ యూనియన్ మీదుగా జర్మనీకి వెళ్లాలనుకున్నారు. దీనికి అనుగుణంగా పావులు కదపటం మొదలెట్టారు. తప్పించుకోవటానికి కొద్దివారాల ముందు నుంచే... సందర్శకులను, బంధువులను కలవటం ఆపేశారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారనే భావన కలిగించారు. బ్రిటిష్ గార్డులను చూడటానికీ ఇష్టపడేవారు కాదు. తన అన్న కుమారుడు శిశిర్ బోస్ ఒక్కడే రోజూ వచ్చి రాత్రిదాకా ఆయనతో గడిపి వెళ్లేవాడు. ఇదే సమయంలో.. తన రూపు రేఖలు మారేలా గడ్డం పెంచారు. చాలారోజులుగా చూడనివారు ఒక్కసారిగా చూస్తే ఈయన బోస్ అని గుర్తుపట్టలేనంతగా! ఇలా... శిశిర్ తప్ప మరెవరినీ కలవకుండా ఏకాంతంగా ఉండటం నిత్యకృత్యమైంది. ఆంగ్లేయ భద్రతాసిబ్బంది కూడా దీనికి అలవాటు పడ్డారు.
అలా అంతా రోజువారీ తంతులో మునిగితేలుతున్న వేళ... 1941 జనవరి 16న - తప్పించుకునే ప్రణాళికకు బోస్ ముహూర్తం పెట్టేశారు. నల్లని జర్మన్ వాండరర్ కారులో శిశిర్ రాత్రిపూట బోస్ను కలిసేందుకు ఎప్పటిలాగే వచ్చారు. ముస్లింలు ధరించే టోపీ, దుస్తులతో బోస్ సిద్ధంగా ఉన్నారు. రాత్రి ఒకటిన్నర సమయంలో బయటకు వచ్చిన శిశిర్.. డ్రైవర్ సీటులో కూర్చొని తనవైపు డోర్ను సెంట్రీలకు వినిపించేలా బలంగా వేశారు. ఒకే డోర్ శబ్దం వినిపించిన సెంట్రీలు ఒక్కరే ఎక్కారనుకొని నిర్లిప్తంగా ఉండిపోయారు. వెనక డోర్లోంచి బోస్ సైతం నక్కి కూర్చున్నారనే సంగతి గుర్తించలేదు. డోర్ను పూర్తిగా వేయకుండా కాస్త దూరం వెళ్లేదాకా అలాగే పట్టుకొని కూర్చున్న బోస్ ఇక బయటపడ్డాం అనుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దారిలో తమ బంధువు అశోక్నాథ్ బోస్ ఇంట భోజనం చేసి... బిహార్లోని గోమోహ్ (ప్రస్తుతం ఝార్ఖండ్లో ఉంది) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ కల్కా మెయిల్ రైలు ఎక్కారు బోస్. స్టేషన్లో పోలీసులున్నా... మారిన వేషంలో ఆయన్ను గుర్తించలేకపోయారు. రైల్లో పెషావర్ చేరుకున్న నేతాజీ సులభంగానే అఫ్గానిస్థాన్లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి సోవియట్కు వెళ్లాలనేది ఆలోచన. కానీ అఫ్గాన్లో తనకు పాష్టో భాష రాకపోవటంతో పట్టుబడే పరిస్థితి ఎదురైంది. దీంతో... అప్పటికప్పుడు స్థానిక గిరిజనుడిగా వేషం మార్చి.. బధిరుడిగా నటించి బయటపడ్డారు. ఆగాఖాన్-3 అనుచరులు ఆయన సోవియట్లోకి అడుగుపెట్టడానికి సహకరించారని చెబుతుంటారు.
బ్రిటిష్వారి నిఘా గురించి తెలిసిన బోస్... తన ఆనుపానులు మార్చేశారు. ఇటాలియన్ పాస్పోర్టుతో మాస్కోకు ప్రయాణించారు. అక్కడి నుంచి రోమ్కు వెళ్లి... 1941 ఏప్రిల్లో జర్మనీ చేరుకున్నారు. 1942లో జర్మన్ నియంత హిట్లర్ను కలుసుకున్నారు. బ్రిటిష్పై దుష్ప్రచారానికే తనను హిట్లర్ వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించి... జపాన్కు వెళ్లారు. ఆ దేశ సైన్యం సాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటుచేశారు. ఆంగ్లేయులపై దాడులు ఆరంభించారు. అండమాన్ నికోబార్ దీవులు కొంతకాలం నేతాజీ ఫౌజ్ స్వాధీనంలోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం మళ్లీ చేజారాయి. ఆంగ్లేయులను ఫౌజ్ ప్రత్యక్షంగా ఓడించకున్నా... వారిలో భయాన్ని నింపి, పరోక్షంగా వారి నిష్క్రమణకు కీలకమైందనేది వాస్తవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ