YS Vivekananda Reddy: వివేకా హత్య వెనుక పెద్దలు
‘వైఎస్ వివేకానందరెడ్డిని చంపేయ్. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, డి.శంకర్రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’
వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పారు
వివేకాను చంపమన్నది ఆయనే
హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయన్నారు.. రూ.5 కోట్లు నాకు ఇస్తానని.. కోటి అడ్వాన్సు ఇచ్చారు
న్యాయస్థానం, సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి
ఈనాడు, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని చంపేయ్. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, డి.శంకర్రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య కుట్ర రూపొందిందని చెప్పారు. ‘డ్రైవర్గా ఏం సంపాదిస్తావ్? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది’ అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సీఆర్పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అందులోని సంచలన విషయాలివీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారు..
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయారు. వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శంకర్రెడ్డి సరిగా మద్దతివ్వని కారణంగానే ఆయన ఓటమిపాలయ్యారు. తర్వాత వివేకా ఓ రోజు హైదరాబాద్ నుంచి తిరిగివస్తూ ముద్దనూరు రైల్వేస్టేషన్ వద్ద తనను పికప్ చేసుకోమని నాతో చెప్పారు. ఆయన్ను తీసుకొస్తుండగా మార్గమధ్యలో గంగిరెడ్డికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. మేం వివేకా ఇంటికి వెళ్లేసరికి గంగిరెడ్డి అక్కడ ఉన్నారు. తర్వాత ఆయన్ను వెంటబెట్టుకుని వైఎస్ అవినాష్రెడ్డి ఇంటికి బయల్దేరారు. దారిలో ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు. నాకు అన్ని విషయాలు తెలిశాయి’ అంటూ గంగిరెడ్డిపై వివేకా మండిపడ్డారు. అవినాష్రెడ్డి ఇంటికి వెళ్లాక అక్కడున్న డి.శంకర్రెడ్డిని ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబసభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించారు. తర్వాత అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డిలను మీ అందరి కథ చెప్తానంటూ కేకలేశారు. కాసేపటి తర్వాత వివేకా.. గంగిరెడ్డి, జగదీశ్వర్రెడ్డిలను తన కార్యాలయానికి పిలిపించుకుని బాగా తిట్టారు. అప్పటి నుంచి పది రోజులపాటు వారిద్దరూ వివేకాతో మాట్లాడలేదు.
సెటిల్మెంట్ డబ్బుల్లో వాటా అడిగిన గంగిరెడ్డి
కడపకు చెందిన రాధాకృష్ణమూర్తికి సంబంధించిన ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారం కోసం వివేకానందరెడ్డి, గంగిరెడ్డిలను వారంలో మూడు నాలుగుసార్లు బెంగళూరు తీసుకెళ్లేవాణ్ని. సెటిల్మెంట్ పూర్తయ్యాక అందులో రావాల్సిన రూ.8 కోట్లు వివేకా చేతికందాయి. తర్వాత ఓరోజు అక్కడ గెస్ట్హౌస్లో ఉండగా ఎర్ర గంగిరెడ్డి.. వివేకాను ఆ డబ్బుల్లో వాటా అడిగాడు. దీంతో గంగిరెడ్డిపై వివేకాపై కోపంగా అరిచారు. అప్పటి నుంచి వారిద్దరికీ మాటల్లేవు. కొన్నాళ్ల ముందే యాదటి సునీల్ యాదవ్ను గజ్జల ఉమాశంకర్రెడ్డి వివేకాకు పరిచయం చేశారు. తర్వాత కొన్నాళ్లపాటు వివేకా, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్రెడ్డి కలిసి కారులో బెంగళూరు వెళ్తుండేవారు. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో గంగిరెడ్డి తనను బైపాస్ చేస్తున్నాడని అప్పుడే వివేకా గుర్తించారు.
వివేకా ఇంటి తలుపులు తీసింది గంగిరెడ్డే
సునీల్ ఆదేశాల మేరకు నేను కదిరి వెళ్లి హత్యకు గొడ్డలి తెచ్చాను. వివేకా ఇంట్లో ఎవరూ లేరని గంగిరెడ్డి చెప్పాడని, అక్కడికి వెళ్దామని సునీల్ చెప్పాడు. దీంతో నేను, సునీల్ వివేకా ఇంటి దగ్గరకు వెళ్లి మద్యం తాగాం. హత్య జరిగిన రోజు రాత్రి 11.40 గంటలకు వివేకా కారులో ఇంటి లోపలికి వెళ్తుండటం చూశాం. ఉమాశంకర్రెడ్డి.. గంగిరెడ్డిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి వివేకా ఇంటి వద్ద దించారు. తర్వాత మా దగ్గరకు వచ్చాడు. ముగ్గురం అర్ధరాత్రి 1.30 గంట వరకూ మద్యం తాగి, బైక్పై వివేకా ఇంటి వెనుకకు వెళ్లాం. ప్రహరీ దూకి లోపలికి వెళ్లాం. అక్కడ వాచ్మెన్ రంగన్న నిద్రపోతున్నాడు. పక్క వాకిలి తలుపుతట్టగా గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి పిలిచారు. ఆ సమయంలో వివేకా మమ్మల్ని చూసి.. ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని గంగిరెడ్డిని ప్రశ్నించాడు. డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారంటూ సమాధానమిచ్చాడు.
గొడ్డలితో దాడి చేసింది ఉమాశంకర్రెడ్డే
ఆ తర్వాత వివేకా హాల్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లారు. గంగిరెడ్డి బెంగళూరు భూ సెటిల్మెంట్ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని ఆయన్ను అడిగాడు. ‘సెటిల్మెంట్ చేసింది నేనైతే... నీకు వాటా ఎలా ఇస్తాను?’ అని వివేకా ప్రశ్నించారు. ఉమాశంకర్రెడ్డి కలగజేసుకుని తమకేమీ సాయం చేయనందున సెటిల్మెంట్ డబ్బులో వాటా ఇవ్వాలని అడిగాడు. దీంతో వివేకా.. గంగిరెడ్డిపైకి వచ్చి నన్ను సెటిల్మెంట్ డబ్బులు ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నించారు. ఇంతలో సునీల్ వివేకాను అసభ్యంగా తిడుతూ ముఖంపై కొట్టాడు. ఆయన వెనక్కిపడిపోయారు. ఉమాశంకర్రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి తీసుకుని వివేకా తలపై కొట్టడంతో రక్తం వచ్చింది. సునీల్ వివేకా ఛాతీపై ఏడెనిమిదిసార్లు బలంగా కొట్టాడు. గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్రెడ్డి డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతుకుతుండటంతో వివేకా వారిపై గట్టిగా అరిచాడు. దీంతో నేను ఆయన కుడి అరచేతిపై గొడ్డలితో కొట్టి, గాయపరిచాను. కాసేపటికి వారికి కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. మేం తప్పించుకునేందుకు.. డ్రైవర్ ప్రసాదే తనను చంపి పారిపోయాడని, అతణ్ని వదలొద్దంటూ వివేకాతోనే బలవంతంగా ఓ లేఖ రాయించి సంతకం పెట్టించాం. తర్వాత బాత్రూమ్లోకి తీసుకెళ్లి వివేకాను చంపుదామని గంగిరెడ్డి చెప్పటంతో ఆయన్ను తీసుకెళ్లి బాత్రూమ్లో పడేశాం. ఉమాశంకర్రెడ్డి వివేకా తలపై అయిదారుసార్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆయన చనిపోయారు. తర్వాత గంగిరెడ్డి మెయిన్రోడ్డు వైపు వెళ్తుండగా రంగన్న లేచి ఎవరూ అని అరిచాడు. నేను, సునీల్, ఉమాశంకర్రెడ్డి ప్రహరీ దూకి బయటపడ్డాం. గొడ్డలిని సునీల్కు ఇచ్చేసి ఇంటికొచ్చేశాను. ఉదయం 5గంటలకు సునీల్, నేను గంగిరెడ్డి ఇంటికి వెళ్లాం. ‘మీరేం భయపడొద్దు. నేను శంకర్రెడ్డి, వై.ఎస్.అవినాష్రెడ్డిలతో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. మీకివ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తా’ అని గంగిరెడ్డి చెప్పాడు. 2019 మార్చి 15న పోలీసులు మమ్మల్ని విచారణకు పిలిపించారు. అప్పుడూ గంగిరెడ్డి నాతో ‘మీరేం భయపడొద్దు. హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించేశాను. ఆధారాలు లేకుండా చేశాను’ అని చెప్పారు.
సీబీఐకి చెప్పొద్దని ప్రలోభపెట్టారు
ఈ ఏడాది మార్చి 3న సీబీఐ నన్ను దిల్లీకి పిలిపించింది. ఆ సమయంలో శంకర్రెడ్డి, అతని సన్నిహితులు భయపురెడ్డి, విద్యారెడ్డి వారి గురించి సీబీఐకి ఏమీ చెప్పొద్దని డబ్బులిస్తామని, జీవితంలో స్థిరపడేలా చేస్తామని నాకు చెప్పారు. దిల్లీలో నా దగ్గరికి భరత్యాదవ్ను పంపించారు. అతను జరిగే విషయాలన్నీ శంకర్రెడ్డికి తెలియజేసేవాడు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను, భరత్యాదవ్ భయపురెడ్డిని కలిశాం. సునీల్ యాదవ్.. వివేకాను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఆయన మర్మాంగాలపై దాడి చేశాడని అంతకు ముందు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్నాడు.
వివేకాను చంపేయమని గంగిరెడ్డే చెప్పారు
‘‘2018 డిసెంబరులో వివేకా వద్ద డ్రైవర్గా పనిమానేశాను. తర్వాత కూడా సునీల్, ఉమాశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిని తరచూ కలిసేవాణ్ని. 2019 ఫిబ్రవరి 10న సునీల్.. నన్ను, ఉమాశంకర్రెడ్డిని గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఓ నల్ల రంగు బొలెరో వాహనం నిలిపి ఉంది. మేం లోపలికి వెళ్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు. తర్వాత గంగిరెడ్డి నాతో మాట్లాడుతూ..‘బెంగళూరు భూ సెటిల్మెంట్లో వివేకానందరెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. ఆయన్ను నువ్వు చంపెయ్’ అని అన్నారు. ఆయన దగ్గర పనిచేశా, హత్య చేయనన్నాను. ‘నువ్వొక్కడివే కాదు. మేమూ ఉంటాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, డి.శంకర్రెడ్డిలు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తా’ అని గంగిరెడ్డి చెప్పాడు. నాలుగు రోజుల తర్వాత హెలిప్యాడ్ వద్దకు పిలిపించి సునీల్ నాకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడు. మళ్లీ ఇస్తానంటూ రూ.25 లక్షలు అతనే తీసుకున్నాడు. మిగిలిన 75 లక్షలు నా స్నేహితుడు మున్నా వద్ద ఉంచాను. డబ్బులు ఉంచినందుకు రూ.5, 6 లక్షలు కమీషన్ ఇస్తానన్నాను.’’
- వాంగ్మూలంలో దస్తగిరి
ఎవరు ఏంటి?
* ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. ఆయనతో పాటే ఉండేవారు.
* గజ్జల ఉమాశంకర్రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డికి సోదరుడు. పాలడెయిరీ నిర్వహిస్తుంటారు.
* యాదటి సునీల్ యాదవ్: పులివెందుల మండలం మెట్నంతలపల్లె. జగదీశ్వరరెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యారు.
* దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్గా పనిచేశారు.
* డి.శంకర్రెడ్డి: వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అనుచరుడు
* వైఎస్ అవినాష్రెడ్డి: కడప ఎంపీ
* వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి: వైఎస్ కుటుంబీకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్భవన్లో సీతారామ కల్యాణం
రాజ్భవన్లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!