ప్రజలకు మరింత చేరువగా భాజపా
ప్రజలకు మరింత చేరువగా పార్టీని చేర్చాలని ప్రధాని తమకు దిశానిర్దేశం చేసినట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
ఈనాడు, దిల్లీ: ప్రజలకు మరింత చేరువగా పార్టీని చేర్చాలని ప్రధాని తమకు దిశానిర్దేశం చేసినట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్ని మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో నాలుగున్నర గంటల పాటు భేటీ అయ్యారని తెలిపారు. ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆయా వర్గాలకు చేసిన ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయామోర్చాలపై ఉందని తెలిపినట్లు చెప్పారు. మండల స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన తీరుపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ (సంస్థాగత) మార్గనిర్దేశం చేశారని లక్ష్మణ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్