నారా భువనేశ్వరి పాదాలు కన్నీళ్లతో కడుగుతాం

‘మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టాం.. ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైకాపా

Published : 05 Dec 2021 04:31 IST

వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ‘మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టాం.. ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతాం...’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ... ‘వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా... ఆ మాటలు వైకాపా ఎమ్మెల్యేలు అన్నారని ప్రచారం చేయడం తగదన్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మను ఎంతగా గౌరవిస్తామో... అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అదే స్థాయిలో గౌరవిస్తామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం గౌరవసభ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో భువనేశ్వరిని అగౌరవపరచడం సబబుగా లేదని ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని