నేడు భాజపాలోకి విఠల్‌

తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్‌.విఠల్‌ సోమవారం భాజపాలో చేరనున్నారు. తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా, కో-ఛైర్మన్‌గా ఆయన ఉద్యమ సమయంలో పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం

Published : 06 Dec 2021 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్‌.విఠల్‌ సోమవారం భాజపాలో చేరనున్నారు. తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా, కో-ఛైర్మన్‌గా ఆయన ఉద్యమ సమయంలో పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన విఠల్‌ పదవీకాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారం ఆయన దిల్లీకి వెళ్లారు. సోమవారం భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 7న తీన్మార్‌ మల్లన్న కమలదళంలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని