అప్పుడు కేజ్రీవాల్‌.. ఇప్పుడు సిద్ధూ

వచ్చే ఏడాది పంజాబ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లు పదునైన విమర్శలు, పోటాపోటీ ఆందోళనలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు...

Updated : 06 Dec 2021 05:57 IST

దిల్లీలో సీఎం నివాసం ఎదుట పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ ఆందోళన

అతిథి ఉపాధ్యాయుల డిమాండ్‌కు   మద్దతుగా బైఠాయింపు

కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట ధర్నాలో కూర్చొన్న సిద్ధూ

దిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లు పదునైన విమర్శలు, పోటాపోటీ ఆందోళనలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు పంజాబ్‌లో పర్యటించిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పలు రకాల హామీలు గుప్పిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మొహాలీలో గత నెల్లో ఒప్పంద ఉపాధ్యాయులు ఆందోళన చేయగా ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆప్‌ ఆధికారంలోకి వస్తే ఒప్పంద ఉపాధ్యాయులు అందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. సరిగ్గా అదే రీతిలో పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆదివారం కేజ్రీవాల్‌కు బదులిచ్చారు. ఈ మేరకు దిల్లీలోని అతిథి ఉపాధ్యాయుల ఆందోళనలో పాల్గొన్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారమిక్కడి సివిల్‌ లైన్స్‌లోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు హాజరైన సిద్ధూ వారితో కలిసి బైఠాయించారు. దిల్లీ ప్రభుత్వం ఒప్పంద విద్యా విధానాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని