Komatireddy: నల్గొండకు వేరే నాయకుల అవసరం లేదు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు వేరే నాయకుల అవసరం లేదని ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు.
గాంధీభవన్, న్యూస్టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాకు వేరే నాయకుల అవసరం లేదని ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ బహిరంగ సభకు సంబంధించి జనసమీకరణ, ఏర్పాట్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం ఉమ్మడి నల్గొండలో పార్టీ శ్రేణులతో తలపెట్టిన సన్నాహక సమావేశం నేపథ్యంలో కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు. సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం వల్ల రేవంత్ కార్యక్రమానికి వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్తో పొత్తుకు కేసీఆర్ అడిగారని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రాజెక్టుల పూర్తికి తక్షణమే నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత