KA Paul: త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర: కేఏ పాల్
తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేపడతానని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఆటలు సాగబోవన్నారు. అమీర్పేటలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమీర్పేట, తంగళ్లపల్తి, సిరిసిల్లగ్రామీణం-న్యూస్టుడే: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేపడతానని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఆటలు సాగబోవన్నారు. అమీర్పేటలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని చెప్పారు. మళ్లీ సిరిసిల్లకు వెళతానని.. వెళ్తే చంపుతారా, అరెస్టు చేస్తారా.. చెప్పాలని సవాల్ విసిరారు. డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్కుమార్లే తనపై దాడి చేయించారని ఆరోపించారు.
మరోవైపు కేఏ పాల్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెరాస నేత తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు మంగళవారం ఉదయం డీజీపీ మహేందర్రెడ్డిని కలిసేందుకు పాల్ తన పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా అందుకు అనుమతి లేదంటూ నిర్బంధించారు. దీంతో బుధవారం తాను డీజీపీని కలుస్తానని పాల్ చెప్పారు.
పాల్ను కలిసిన బస్వాపూర్ రైతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన రైతులు మంగళవారం హైదరాబాద్లో పాల్ను కలిశారు. పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు 5 రోజులలోపు ఇవ్వాలని.. లేకుంటే ఆ పరిహారం అందించడానికి తనకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్లు రైతులు తెలిపారు. పాల్పై దాడి సంఘటన విషయంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్