ఎస్సీ ఉపకులాలకు అందని ఫలాలు
ఎస్సీ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఫలాలు అందడంలేదని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 57 దళిత ఉపకులాల సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్కు
పలువురు నేతల ఆవేదన
ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష
రాంనగర్, న్యూస్టుడే: ఎస్సీ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఫలాలు అందడంలేదని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 57 దళిత ఉపకులాల సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్రావు, తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జేబీ రాజు తదితరులు మద్దతు తెలిపారు. ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలను అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాలకు దళిత బంధు పథకం వర్తింపజేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసం దళితులను వాడుకొని వదిలేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. దళిత బంధు కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన సీఎం.. ఇప్పుడు నియోజకవర్గానికి 100 మందికే ఇస్తామని అంటున్నారని ఆక్షేపించారు. బడ్జెట్లో రూ.17 వేల కోట్లు కేటాయించారని, ఆ మొత్తాన్ని దళితబంధుకు ఖర్చు చేస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి, హోలియ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదిముళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి