దిల్లీలో తెరాస కార్యాలయ స్థల పరిశీలన

దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ

Published : 20 May 2022 05:48 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి గతేడాది సెప్టెంబరులో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు చేపడతారని భావించినా కొంతకాలం పాటు స్తబ్ధత నెలకొంది. తాజాగా దిల్లీ వేదికగా పార్టీ కార్యకలాపాలు వేగవంతం చేయాలని భావిస్తున్న తెరాస అధిష్ఠానం కార్యాలయ నిర్మాణ పనులపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే మంత్రి ప్రశాంత్‌రెడ్డి కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, నిర్మాణ నమూనాలను పరిశీలించారు. కాగా మంత్రి పర్యటన వివరాలు వెల్లడించడానికి పార్టీ వర్గాలు విముఖత వ్యక్తం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని