రైతాంగం గాలికి.. విమానాల్లో సీఎం: తెదేపా

ధాన్యం అమ్మలేక అనేక కష్టాల్లో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలనే బాధ్యతను గాలికొదిలేసి దేశమంతా గాలి మోటార్లో(విమానంలో) సీఎం కేసీఆర్‌ తిరుగుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర

Published : 21 May 2022 05:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం అమ్మలేక అనేక కష్టాల్లో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలనే బాధ్యతను గాలికొదిలేసి దేశమంతా గాలి మోటార్లో(విమానంలో) సీఎం కేసీఆర్‌ తిరుగుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గత 8 సంవత్సరాల కాలంలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ మేరకు ఆర్థిక సాయం ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ రైతులకు సాయం చేయలేని ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకుంటామని బయలుదేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని