ఇక్కడ సమస్యలు వదిలేసి.. ఇతర రాష్ట్రాల్లో ఏం ఉద్ధరిస్తారు?

రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏం ఉద్ధరిస్తారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Published : 22 May 2022 05:14 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏం ఉద్ధరిస్తారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌కు వస్తుంటే మొహం చెల్లకే సీఎం దిల్లీ, ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లారని అన్నారు. ఈటల శనివారం భాజపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనేకసార్లు గెలిచి, ఎంతో అనుభవం ఉన్న సీఎం దిల్లీకి వెళ్లి అక్కడ విద్య, వైద్య రంగాల పరిస్థితిని పరిశీలిస్తున్నారంటే తెరాస ప్రభుత్వం ఆ రంగాలపై నిబద్ధత చూపనట్లేనని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని