రాహుల్‌.. దేశం పరువు తీస్తున్నారు: భాజపా

లండన్‌లో రాహుల్‌ ప్రసంగంపై భాజపా మండిపడింది. విదేశాల్లో భారత్‌ పరువు తీయడం కాంగ్రెస్‌ నేతకు అలవాటుగా మారిందని, గతంలోనూ ఇలానే చేశారని ఆక్షేపించింది. కిరోసిన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం

Published : 22 May 2022 05:17 IST

దిల్లీ: లండన్‌లో రాహుల్‌ ప్రసంగంపై భాజపా మండిపడింది. విదేశాల్లో భారత్‌ పరువు తీయడం కాంగ్రెస్‌ నేతకు అలవాటుగా మారిందని, గతంలోనూ ఇలానే చేశారని ఆక్షేపించింది. కిరోసిన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1984 సిక్కు అల్లర్ల నుంచి కాంగ్రెస్‌ కిరోసిన్‌ పట్టుకొని తిరుగుతోందని, ఆ పార్టీ రేపిన మంటలు ఇంకా చల్లారలేదని విమర్శించింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు గతంలోలా లేదని, అధికారులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు. ‘‘అవును మారిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారు. ఇతరుల వాదనను వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఇది అహంకారం కాదు. ఆత్మవిశ్వాసం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడం’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని