జీఎమ్మార్‌ వెబ్‌సైట్‌లో రాజీవ్‌ పేరు తొలగింపు: దాసోజు శ్రవణ్‌

జీఎమ్మార్‌ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాజీవ్‌గాంధీ పేరును తొలగించిందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆక్రోశం

Published : 22 May 2022 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీఎమ్మార్‌ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాజీవ్‌గాంధీ పేరును తొలగించిందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన ఒక లేఖ రాశారు. ‘‘విమానాశ్రయంలో 13 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జీఎమ్మార్‌ సంస్థ ఇలాంటి సాహసం చేయదు. వెంటనే రాజీవ్‌గాంధీ విగ్రహం, చిహ్నాలతోపాటు విమానాశ్రయం పేరును పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలి’’ అని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని